మహారాష్ట్రలోని ప్రఖ్యాత రుచులను మీరూ ఆస్వాదించండి!
మహారాష్ట్ర పేరు వింటేనే విహారం గుర్తుకువస్తుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ లభించే ప్రసిద్ధ వంటకాలను ఆస్వాదించడానికి దేశ, విదేశీ పర్యాటకులు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. అందుకే మహారాష్ట్ర ఫేమస్ ఫుడ్తోపాటు అనేక పర్యాటక ప్రదేశాలు సందర్శించడానికి ఉత్తమమైన నగరంగా పేరుగాంచింది. అందుకే, మహారాష్ట్రలోని ఫేమస్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
విభిన్నమైన రుచిని ఆస్వాదించేందుకు మహారాష్ట్ర మీకు స్వాగతం పలుకుతుంది. ప్రసిద్ధ ఆహారానికే కాదు, మహారాష్ట్రలో ఎక్కువ పర్యాటక ప్రదేశాలూ ఉన్నాయి. ఈ నగరంలో చారిత్రక దేవాలయాలు, అభయారణ్యం కోసం నిత్యం సందర్శకులు క్యూ కడుతుంటారు. ఈ నగరం యొక్క ప్రసిద్ధ వంటకాల గురించి మాట్లాడుకుంటే, మీరు మహారాష్ట్రను సందర్శించబోతున్నట్లయితే, ఖచ్చితంగా ఇక్కడ ప్రసిద్ధ వంటకాలను ప్రయత్నించండి. మహారాష్ట్రలోని ఫేమస్ ఫుడ్స్ విశేషాలను చూద్దాం.

వడా పావ్
మహారాష్ట్రలోని వడా పావ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రజలు దీనిని అల్పాహారంగా తింటారు. మీరు ఈ నగరంలో షికారుకి వెళితే, వడ పావ్ రుచి చూడటం మర్చిపోకండి. ఈ సరికొత్త రుచి జీవితంలో మర్చిపోలేని ఎన్నో జ్ఙాపకాలను చేరువ చేస్తుంది.

పురాన్ పోలి
పూరాన్ పోలి రుచి మధురంగా ఉంటుంది. దీన్ని తయారు చేసేందుకు బెల్లం, శనగపిండి, యాలకులు ఉపయోగిస్తారు. ముఖ్యంగా పండుగల సమయంలో ఈ వంటకం చేసే సంప్రదాయం ఉంది. దీని ఘుమఘుమలు సుదూర ప్రాంతం విస్తరిస్తుంది.

తాలిపీఠ్
మహారాష్ట్రలోని ప్రజలు ఈ వంటకాన్ని ఎంతో ఉత్సాహంగా తింటారు. ఇది రుచితో పాటు ఆరోగ్యంతో కూడుకున్నది. దీనిని తయారు చేయడానికి పప్పులు మరియు పిండిని ఉపయోగిస్తారు. పర్యాటకులు ఈ వంటకాన్ని రుచి చూసేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు.

భేల్పురి
మీకు భేల్పురి ప్రతిచోటా సులభంగా దొరుకుతుంది. కానీ మహారాష్ట్రలోని భేల్పురి పేరు వింటేనే నోరూరుతుంది. మహారాష్ట్రలోని ప్రతి వీధిలో మీకు ఇది కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో భేల్పూరి రుచికి సాటి మరెక్కడా ఉండదంటే నమ్మండి.

పావ్ భాజీ
మహారాష్ట్రకు చెందిన పావ్ భాజీ రుచి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. ఇది అనేక కూరగాయల మిశ్రమం నుండి తయారు చేయబడుతుంది. వెన్నలో ముంచి తర్వాత కాల్చిన పావ్తో దీనిని వడ్డిస్తారు. స్థానిక తయారీదారులే వివిధ పర్యాటక ప్రదేశాలలో పావ్ భాజీని అందిస్తూ ఉంటారు.

చేపల కూర
మహారాష్ట్ర ప్రజలు చేపలను చాలా ఇష్టపడతారు. మీరు మహారాష్ట్రను సందర్శించడానికి వెళ్లినప్పుడల్లా, చేపల కూరను తప్పకుండా ప్రయత్నించండి. ఇక్కడి ప్రజలు అన్నంతో తినడానికి ఇష్టపడతారు. ఒక్కసారి రుచి చూస్తే.. చేపల కూర ఇక్కడే ఎందుకు ప్రసిద్ధి చెందిందో మీకు అర్థమైపోతుంది.

మోదక్
మోదక్ మహారాష్ట్రలో అత్యంత ప్రసిద్ధ వంటకం. దీనిని బెల్లం మరియు కొబ్బరితో తయారు చేస్తారు. ముఖ్యంగా గణేష్ చతుర్థి సందర్భంగా మోదక్ చేసే సంప్రదాయం ఉంది. దీనిని గణేశునికి సమర్పించి, అనంతరం ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు.

కధి
కధి కూడా మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన వంటకం. దీని తయారీకి శనగపిండి, పెరుగు, కరివేపాకులను ఉపయోగిస్తారు. చూడగానే నోరురించే ఈ వంటకాన్ని పిల్లలు అమితంగా ఇష్టపడతారు. మీరు మహారాష్ట్రను సందర్శించబోతున్నట్లయితే, కధి రుచిని అస్సులు మిస్సవ్వొద్దు.



Click it and Unblock the Notifications












