Search
  • Follow NativePlanet
Share
» »బ్రిటీష్ వలసరాజ్యాల కాలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలు

బ్రిటీష్ వలసరాజ్యాల కాలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలు

బ్రిటీష్ వలసరాజ్యాల కాలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలు

భారతదేశం శ‌తాబ్దాల కాలంపాటు బ్రిటిష్ వ‌ల‌స‌రాజ్యాల పాల‌న‌లో ఉంది. ఈ స‌మ‌యం భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైనది. అలనాటి స్మారక చిహ్నాలు నేటికీ భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నాయి. ఆ నిర్మాణాలు దేశం ఎదుర్కొన్న ఎన్నో స‌వాళ్ల‌కు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తాయి.

బ్రిటీష్ వలసరాజ్యాల కాలంలో దేశంలో అలాంటి స్మారక కట్టడాలు చాలానే ఉన్నాయి. ఈ విలక్షణమైన భవనాలు ఇప్పుడు గత జ్ఞాపకంగా నిలుస్తాయి. ప్రతిరోజూ అనేక మంది చరిత్ర అభిమానులను ఆకర్షిస్తున్నాయి. భారతదేశంలో వలసరాజ్యాల కాలంలో నిర్మించిన కొన్ని చారిత్రక కట్టడాలను చూద్దాం రండి!

historicalmonuments

రైట‌ర్స్ బిల్డింగ్‌

భారతదేశంలో బ్రిటీష్ వలసరాజ్యాల కాలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలలో 1777లో థామస్ లియోన్ చేత నిర్మించబడిన రైటర్స్ బిల్డింగ్ ఒక‌టి. ఇది కోల్‌కతాలోని మొదటి మూడు అంతస్తుల భ‌వ‌నంగా చెబుతారు. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ రచయితలకు వసతి కల్పించడానికి నిర్మించబడింది. అప్పటి నుండి ఈ భవనం లెక్కలేనన్ని బ్రిటిష్ నిపుణులకు చ‌ర్చావేదిక‌గా మారింది. దీనికి అనుగుణంగా ఈ స్మారక చిహ్నం చుట్టుపక్కల అనేక పునర్నిర్మాణాలు చేయబడ్డాయి. ఇప్పుడు, రైటర్స్ బిల్డింగ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది.

st peters

సెయింట్ పాల్స్ కేథడ్రల్

భారతదేశంలో బ్రిటీష్ వలసరాజ్యాల కాలంలో నిర్మించిన చారిత్రక కట్టడాల‌లో విలియం నైర్న్ ఫోర్బేస్చ్ రూపొందించబడిన సెయింట్ పాల్స్ కేథడ్రల్ ప్రాచుర్యం పొందింది. దీనిని 1847లో నిర్మించారు. ఇది కౌంటీలోని కలోనియల్ ఆర్కిటెక్చర్ యొక్క అత్యుత్తమ ఉదాహరణలలో ఒకటి. ఆ కారణంగా, ఇది చరిత్ర ఔత్సాహికులను ఆకర్షిస్తుంది. కేథడ్రల్‌లోని ఎత్తైన పైకప్పులు, స్టెయిన్డ్ గ్లాస్ కిటికీలు, ఆర్ట్ పీస్‌లు, చెక్క పీఠాలు యూరోపియన్ చర్చిలను పోలి ఉంటాయి. బ్రిటిష్ సామ్రాజ్యం ఒక విదేశీ దేశంలో నిర్మించిన మొదటి చర్చి ఇది.

ఫోర్ట్ సెయింట్ జార్జ్

ఫోర్ట్ సెయింట్ జార్జ్

ఈ స్మారక చిహ్నం చెన్నైలోని బంగాళాఖాతం ఒడ్డున ఉంది. ఇది భారతదేశంలోని మొదటి ఆంగ్ల కోటగా పరిగణించబడుతుంది. ఇది 1640లో ఈస్టిండియా కంపెనీకి ట్రేడింగ్ పోస్ట్‌గా స్థాపించబడింది. దాని మొదటి నిర్మాణాన్ని అనుసరించి, ఈ స్మారక చిహ్నం ఈనాటికి అనేకసార్లు పునరుద్ధరించబడింది. సెయింట్ జార్జ్ ఫోర్ట్ ఇప్పుడు భారతదేశంలోని వలస పాలనను గుర్తుగా ప‌రిగ‌ణించ‌బ‌డుతోంది. ఇది త‌మిళ‌నాడులోని సెక్ర‌టేరియ‌ట్ స‌మీపంలో రాజాజీ రోడ్ ఉంది.

Bombay court

బాంబే హైకోర్టు

1862లో కలోనియల్ ఇండియాలో స్థాపించబడిన మొదటి మూడు హైకోర్టులలో బాంబే హైకోర్టు ఒకటి. భవనం యొక్క పశ్చిమ భాగంలో న్యాయ దేవత విగ్రహం ఉంది. ఆ విగ్ర‌హం ఎదురుగా దయగల దేవత విగ్రహం ఉంది. ఈ భవనంలో భారతదేశంలోని బ్రిటిష్ పాలన చరిత్రను సూచించే అనేక నిర్మాణ భాగాలు ద‌ర్శ‌న‌మిస్తాయి.

st cathedral

సె కేథడ్రల్

సే కేథడ్రల్ ఆసియాలో అతిపెద్ద చర్చిగా ప్రసిద్ధి చెందింది. ఇది సెయింట్ కేథరిన్ ఆఫ్ అలెగ్జాండ్రియాకు అంకితం చేయబడింది. ఈ చ‌ర్చ్‌ 1940 సంవత్సరంలో నిర్మించబడింది. గోవాలో అత్యంత మతపరమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. కేథడ్రల్ ఐదు భారీ గంటలను కలిగి ఉంది. గోవా యొక్క అతిపెద్ద గంట, గోల్డెన్ బెల్ కూడా ఇక్కడ ఉంది. అనేక చిత్రాలతో అలంకరించబడిన ఇది అలెగ్జాండ్రియాలోని సెయింట్ కేథరీన్ జీవితాన్ని ప‌రిచ‌యం చేస్తుంది.

More News

Read more about: kolkata chennai goa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+