భారతదేశమంతటా నేడు పండుగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా శ్రీరాముని జపమే వినిపిస్తోంది. భారతదేశ భక్తుల్లో భిన్నమైన ఉత్సాహం, ఆనందం కనిపిస్తోంది. చాలా మంది ప్రముఖులు నేడు అయోధ్యలో జరిగిన రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజయ్యారు. అయోధ్యలో రామ మందిర ప్రతిష్టలో పాల్గొన్నారు, దేశంలో ఒక చిన్న భాగం కూడా ఉంది. దీనికి రామ మందిరం లేదా విగ్రహంతో ఏ మాత్రం సంబంధం లేదు.
ఎందుకంటే ఇంతటి ప్రతిష్టాత్మకమైన రోజును ప్రజలు ఒక రెండుమూడు రోజుల్లో మరచిపోతారు. కానీ, ఇక్కడి వారు మాత్రం నిత్యం శ్రీరామునితోనే జీవిస్తుంటారు. ఇక్కడివారికి రాముని భక్తి సమయం నిర్ణయించబడలేదు. కానీ ఇక్కడి ప్రజలు తమ జీవితాన్నే రామునికి అంకితం చేశారు.ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుందో? అక్కడి ప్రజలు రామునికి జీవితాన్ని అంకితం చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకుందాం పదండి.
ఛత్తీస్గఢ్లో రామనామి అని పిలువబడే ఒక సంఘం ఉంది. ఇది రాముడిని ఆరాధించే పరశురాముడు స్థాపించిన హిందూ శాఖ. ఇక్కడి ప్రజలు రామభక్తిలో పూర్తిగా మునిగిపోయుంటారు. ఇక్కడివారంతా తమ జీవితాలను రామునికే అంకితం చేసేశారు. దేశంలో జరిగిన ఇంతటి ప్రతిష్టాత్మకమై వేడుకతో వీరికి సంబంధం లేదు. ఎందుకంటే నిత్యం వీరిలోనే శ్రీరాముడు కొలువై ఉంటాడు. వీరిలో రామభక్తి ఎంతగా నాటుకుపోయిందంటే, ఇక్కడి ప్రజల శరీరమంతా 'రామ్' అనే పేరును టాటూగా వేయించుకున్నారు. ఇది రాముడితో వీరికున్న లోతైన అనుబంధాన్ని తెలియజేస్తుంది. ఈ సమాజానికి, రాముడు వారి సంస్కృతిలో అంతర్భాగం. రాముని పట్ల భక్తి మరియు అతనిని స్తుతించడమే వీరి జీవిత ప్రధాన ఉద్దేశ్యమని చెప్పుకోవాఇల.

ఈ సంఘం ఎప్పుడు స్థాపించబడింది?
ఈ సంఘాన్ని 1870లో స్థాపించారు. జంజ్గిర్ చంపా జిల్లాలోని చర్పారా గ్రామానికి చెందిన సత్నామీ కమ్యూనిటీకి చెందిన పరశురామ్ జీ ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. రామ్ అనే పేరును తొలిసారిగా టాటూ వేయించుకున్నది కూడా ఆయనే కావడం విశేషం. ఈప్రాంతంలో ఉండే ప్రజలు రామనామి కమ్యూనిటీ ప్రజలు వింతైనా ఆకారంలో కనిపిస్తారు. రామ్ పేరు ఇక్కడి వారి శరీరంలోని దాదాపు ప్రతి భాగంపై చెక్కబడి ఉంటుంది. ఈ వ్యక్తులు తమ శరీరంపై రామనామి చాదర్, నెమలి ఈక తలపాగా మరియు తలపై ఘుంఘ్రూ ధరించడంలో ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నారు. ఇక్కడ రామనామి సంఘం గృహాలు కూడా చాలా వైవిధ్యభరితంగా ఉంటాయి.
రామనామి కమ్యూనిటీ ప్రజల ఇళ్లు చాలా సరళంగా ఉంటాయి. ఈ గృహాలు వారి సాధారణ జీవనశైలిని వివరిస్తాయి. మట్టి లేదా వెదురుతో చేసిన ఈ గృహాల వాస్తు ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడి వారి ప్రతి ఒక్కరి శరీరంపై రామ నామం ఉంటుంది. అందుకే ఇక్కడివారు చనిపోయిన తర్వాత వారి మృతదేహాలను కాల్చడం వంటివి చేయరు. ఎందుకుంటే, రామునిపేరు అగ్నిలో కాలిపోవడాన్ని వారు అస్సలు తట్టుకోలేరు. ఆ మృతదేహాలను పంచభూతాలలో విలీనం చేస్తారు. అంతేకాదు, ఈ కమ్యూనిటీ ప్రజలు సహజ సిరా తయారీలో పని చేస్తుంటారు. ఈ సిరా రాముని నామాన్ని జపించడానికి మరియు పూజించడానికి ఉపయోగిస్తారు. ఈ సిరా సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి తయారు చేస్తారు. ఇందులో ఎరుపు రంగు పూల రేకులను ఉపయోగిస్తారు. సిరాకు మందపాటి రంగు ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది. అంతేకాదు ఈ సిరా తయారికీ వారు ఎంతగానో కృషి చేస్తారు.



Click it and Unblock the Notifications













