పేరెన్ జిల్లా లోని దక్షిణ భాగం చివరలో రాష్ట్ర సరిహద్దు లోని నజాఉన విలేజ్ లో ఈ కీసా పర్వతం కలదు. దీనిని మౌంట్ కిషా గా కూడా పర్యాటకులు పిలుస్తారు. నాగా జాతుల వారు వివిధ ప్రాంతాల నుండి ఇక్కడకు వచ్చి కలుసుకునే ప్రదేశం ఇది. కనుక వారికి ఎంతో ప్రాధాన్యత గలది. పీరెన్ నుండి 28 కి.మీ.ల దూరంలో కల ఈ ప్రదేశం తేలికగా చేరవచ్చు.
ఇక్కడనుండి వాలీ లోని ప్రదేశాలు మరియు ఇతర శిఖరాలను పర్యాటకులు చూసి ఆనందించవచ్చు. ఇక్కడి అడవులు దట్టంగా వుండి వివిధ రకాల వృక్ష, జంతు జాలాలతో నిండి వుంటాయి. అనేక ఇతర శిఖరాలవలె, మౌంట్ కిష కూడా అరుదైన వృక్ష సంపదను కలిగి పర్యాటకులను ఆకర్షిస్తోంది.