చారిత్రక ప్రాధాన్యం టిరాకోల్ కోట నిర్మించిన తర్వాత దీర్ఘకాలం అది సావంతవాడి పాలకుడు మహారాజ ఖేమ్ సావంత్ భోంస్లే ఆధీనంలోనే ఉండిపోయింది. ఈ కోట ఒక దక్షిణ మహారాష్ట్ర టవున్ షిప్ గా ఉండిపోయింది. మహారాష్ట్ర లో చివరిదిగాను గోవాలో మొదటిదిగాను ఈ ప్రాంతం ఉంటుంది.
చరిత్రపరంగా ఈ కోట అనేక పరిణామాలకు గురయింది. దీనిపై అనేక పాలకుల జెండాలు ఎగురవేయబడ్డాయి. 1746 సంవత్సరంలో పోర్చుగీసు వారు ఈ కోటను తమ అధీనంలోకి పొందగా, వారి తర్వాత అనేక చేతులు మారి చివరకు 1961 లో స్వాతంత్ర సమర యోధులు దీనిని తమ బసగా కూడా వాడుకొని గోవాను పోర్చుగీసు పాలననుండి విముక్తి చేసి ఇండియాలో కలిపేశారు. నేడు టిరకోల్ కోట పర్యాటకులకు ఏమి చూపగలదు?
టిరకోల్ ప్రదేశం గోవాలో బాగా వెనుక బడినదిగా ఎవరికి తెలియని ప్రదేశంగా ఉండిపోతుంది. ఈ ప్రాంతం ఏ మాత్రం వాణిజ్యపర అవకాశాలు కలిగి లేదు. ఎంతో సహజంగా కనపడుతూంటుంది. చాలామంది విదేశీ పర్యాటకులు టిరకోల్ ను ఒక పిక్ నిక్ ప్రదేశంగా ఎంచుకొని రోజంతా అక్కడి బీచ్ లలో గడుపుతూంటారు. ఈ ప్రదేశ నిర్మాణం టిరకోల్ అనే నది పుట్టిన ప్రదేశంలో జరిగింది. కనుక ఇక్కడి ప్రకృతి దృశ్యాలు అద్భుతంగా ఉంటాయనటంలో సందేహం లేదు. టిరకోల్ కోట సందర్శనకు వేసవి ఎంతో అనుకూలమైనది. టిరకోల్ కోట ఎలా చేరాలి? ఈ కోట ఉత్తర భాగంలో ఉంటుంది. పనాజిం, వాస్కో లేదా గోవాలోని ఇతర భాగాలలో బసచేసే పర్యాటకులకు కొద్దిగా దూరంగా ఉంటుంది కనుక వారు టాక్సీ అద్దెకు తీసుకుని రావలసినదే. అయితే, కండోలిం, బాగా మరియు కాలన్ గూటే బేగేటర్ మరియు బర్డేజ్ లలో వసతి పొందిన పర్యాటకులు మాపూసా మార్గంలో చిన్నపాటి డ్రైవింగ్ లో చేరుకోవచ్చు. ఈ ప్రదేశాలలో ఉన్నవారు బైక్ అద్దెకు తీసుకుని అయినా ఒక రోజులో పర్యటించేయవచ్చు. అయితే రోడ్లు అనేక వంపులుగాను, కొండ ప్రాంతంగాను ఉంటుంది కనుక మీరు డ్రైవింగ్ లో అతి జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది.