భైరోం బాబా విగ్రహం మధ్యప్రదేశ్ రాష్ట్రములో రేవా ప్రధాన నగరం నుండి 40 కిమీ దూరంలో ఉంది. పరమశివుడికి నివాళులు అర్పించేందుకు ప్రతి నెల వేల సంఖ్యలో భక్తులు ఈ ప్రదేశాన్ని దర్శించడానికి వస్తారు. ఈ విగ్రహాన్ని భక్తులు పవిత్రమైనదిగా భావిస్తారు. గుర్హ్ అనే ప్రదేశం వద్ద ఉన్న దేవత భయాన్ని కలిగిస్తుందని స్థానికులు చెప్పుతారు.
ఇక్కడ దేవుడు ఎల్లప్పుడూ భక్తుల కోరికలను నెరవేరుస్తారని నమ్ముతున్నారు. ఈ ప్రదేశము ఒక సరస్సు చుట్టూ ఉండుట వల్ల ఒక అత్యద్భుతమైన అందాన్ని కలిగి ఉంది. ఒక పురాణం ప్రకారం ఈ సరస్సులోని నీటికి అన్ని చర్మ రోగాలను నయం చేసే ఔషధ గుణాలు ఉన్నాయి.
రోజువారీ పూజలు ఆలయ ప్రాంగణంలో జరుగుతాయి. అంతే కాకుండా మహా శివరాత్రి సమయంలో ఒక భారీ ఫెయిర్ ఆలయంలో నిర్వహించబడుతుంది. ఆలయంలో దీవెనలు పొందటానికి ఏడాది పొడవునా భక్తులు సందర్శిస్తారు.



Click it and Unblock the Notifications