మధ్య ప్రదేశ్ లో ని ఈశాన్య ప్రాంతం లో మాల్వా పీఠభూమి వద్ద ఉన్న పార్వతి నది ఒడ్డున ఉన్న ప్రాంతం గుణ. జిల్లా పేరుతొనే ఉన్న నగరం ఇది. చంబల్ మరియు మాల్వా యొక్క గేట్వే గా ఈ ప్రాంతం ప్రసిద్ది. మధ్య ప్రదేశ్ లో ని అన్ని ప్రాంతాలలో బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం గా గుణా జిల్లా పేరొందింది.
చరిత్ర ప్రాచీన అవంతి రాజ్యం లో ఒక భాగమైన గున చాంద్ ప్రద్యోత మహాసేన చేత కనుగొనబడింది. ఆ తరువాత 18 వ శతాబ్దం లో, ఈ ప్రాంతం ప్రసిద్ది చెందినా మరాఠా రాజు అయిన రామోజీ రావు స్సిన్డియా చే అక్రమించబడింది. 1947 లో భారత్ దేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత మధ్య భారతం లో ని 16 జిల్లాలలో ఒకటి గా ఈ ప్రాంతం గుర్తించబడింది. ఆ తరువాత మధ్య భారత్ మధ్య ప్రదేశం లో ఒక భాగమైంది.
గుణ లో ఇంకా చుట్టు పక్కల పర్యాటక ప్రదేశాలు
సందర్శకులని ఆకర్షించేందుకు ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు గుణ లో ఉన్నాయి. పంచముఖి హనుమాన్ ఆశ్రమం వీటిలో ప్రధానమైనది. గుణ నగరం లో వివేక్ కాలనీలో ఈ ఆలయం ఉంది. హనుమంతుని యొక్క అయిదు శక్తులలో ఈ ప్రాంతం ఒకటి గా భావించబడింది. గుణ రైల్వే స్టేషన్ నుండి 4 కిలోమీటర్ల దూరం లో ఈ ప్రాంతం ఉంది. ఈ ఆశ్రమాన్ని సందర్శించే పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కలవు. బిస్భుజి టెంపుల్ అలాగే జైన్ టెంపుల్ లు ఈ ప్రాంతం లో ఉన్న మిగతా పర్యాటక ఆకర్షణలు. బజరంగర్హ్ కోట వీటిలో ప్రముఖమైనది.
గుణ కి పర్యటన గుణ ల ఒక రైల్వే స్టేషన్ కలదు. భోపాల్ లో ఉన్న విమానాశ్రయం ఈ ప్రాంతానికి సమీపం లో ఉన్న విమానాశ్రయం.
ఉత్తమ సమయం
ఫిబ్రవరి మరియు మార్చ్ నెలలల్ ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల ఈ సమయంలో పర్యటన సౌకర్యంగా ఉంటుంది.