దీనిని విదిష లేదా భిల్స అని మధ్యయుగ కాలంలో పిలిచేవారు. ఇది పురాతన అవశేషాలు మరియు చారిత్రక ప్రాధాన్యత గల కట్టడాలు ఉన్న నగరం. బెసానగర్, పురాతన పట్టణం మరియు ఉదయగిరి గుహలు; ఇవి పురాతన గుప్త సామ్రాజ్యకాలంనాటి వైభవానికి ఉదాహరణలు. ఈ నగరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరియు భూపాల్, రాష్ట్ర రాజధాని దగ్గరగా ఉన్నది. మీరు చరిత్ర గల విదిష దారుల గుండా నడుస్తూ వెళుతుంటే, దాదాపు 2600 సంవత్సరాల క్రితం నుండి ఉన్న ఈ అతిపెద్ద వర్తక కేంద్రం మిమ్మలిని ఆశ్చర్యపరుస్తుంది. మీరు హై స్కూల్ టెక్స్ట్ పుస్తకాలలో అశోక చక్రవర్తిని గురించి నేర్చుకుని ఉండవచ్చు. మీరు నడుస్తున్న ఈ వీధులు, అశోకుడు, విదిష గవర్నర్ గా ఉండగా, కొన్ని సంవత్సరాలు వేల క్రితం ఈ చక్రవర్తి యొక్క ఘనమైన ఉనికిని కలిగి ఉన్నవి. ఒకసారి మీరు ఇక్కడ చేరుకోగానే, మీరు ఒక నిమిషం ఇక్కడ నిలబడి అశోక చిత్రం నుండి ఈ చిన్న నగరంలో వేగంగా నడిచే తెలుపు గుర్రం మీద షా రుక్ ఖాన్ ను ఊహించు కోవొచ్చు.
విదిష లో మరియు చుట్టూ ఉన్న పర్యాటక ప్రదేశాలు
విదిష, పర్యాటక స్థలం, ఆర్ధిక కార్యకలాపాలలో ప్రధాన భాగంగా ఉన్నది. విదిష పర్యాటక ప్రదేశం, ఇక్కడ మత మరియు చారిత్రక ప్రాధాన్యత అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రఖ్యాత శిల్పాలు మరియు శాసనాలు, శిధిలాలు మరియు పురాతత్వ ప్రదేశాలు చాలా ఉన్నాయి. విదిష లో ఉన్న ముఖ్యమైన ఆలయాలు కొన్ని గిర్ధారి ఆలయం, ఉదయేశ్వర ఆలయం, దశావతర్ ఆలయం, మాలదేవి ఆలయం, భజ్రమథ్ ఆలయం, గడర్మల్ ఆలయం మరియు సోల-కాంబి టెంపుల్. బిజమండల్, ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం, దీనిని 1682 లో ఔరంగజేబు నేలమట్టం చేశాడు. అప్పటినుండి ఇది శిధిలావస్థలోనే ఉన్నది. సిరోన్జ్, విదిష లోని జైన్ కమ్యూనిటీ యొక్క ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. విదిష లోని మరొక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం హెలియోదోరస్ పిల్లర్, దీనిని ఖంబ బాబా అని కూడా పిలుస్తారు. ఉదయగిరి గుహలు, విదిష పర్యాటక ప్రముఖ ఆకర్షణలలో ఒకటిగా ఉన్నాయి. శాల్భంజికలోని 'గ్యరస్పూర్' ఒక అసాధారణం శిల్పం, ఇది మరొక ముఖ్యమైన ఆకర్షణ. లోహంగి పీర్ మరియు హిందోళ తోరణం, విదిషలో ఉన్న చారిత్రక ప్రాధాన్యత కలిగిన ముఖ్యమైన ప్రదేశాలు. 155 క్రీస్తు శకం నాటి ప్రసిద్ధ జైన్ చిత్రాలు ధర్మపూర్ వద్ద కనిపిస్తాయి.
విదిష : దీని ప్రవేశసౌలభ్యం
విదిషను విమాన,రైల్ మరియు రోడ్ మార్గాల ద్వారా సులభంగా చేరుకోవొచ్చు. భూపాల్ లో ఉన్న రాజా భోజ్ విమానాశ్రయం, మిమ్మలిని, విదిషను కలిపే సన్నిహిత విమానాశ్రయం. అంతేకాక, ఈ ప్రదేశంలో, దాని సొంత రైల్వే స్టేషన్ ను కలిగి ఉన్నది.
విదిషను ఎప్పుడు దర్శించాలి?
విదిషను వానాకాలం మరియు శీతాకాలంలో దర్శించటానికి అనుకూలంగా ఉంటుంది. ఈ కాలాల్లో, వాతావరణం అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. కాని, శీతాకాలంలో, అంటే అక్టోబర్ నుండి మార్చ్ నెలలో దీనిని సందర్శించటానికి అనుకూలంగా ఉంటుంది.