షిర్డీ పరిసరాల్లో ఉన్న పవిత్ర స్థలం గురుస్తాన్. 16 ఏళ్ళ వయసులో తొలిసారిగా వేప చెట్టు క్రింద ఆయన ప్రపంచానికి వెల్లడి అయ్యారు. మార్గోసా గా పిలవబడే ఈ చెట్టు క్రింది స్థానాన్ని గురుస్తాన్ అని వ్యవహరించారు.ఇక్కడ అగరుబత్తి వెలిగిస్తే అన్ని రకాల రుగ్మతల నుంచి విడుదల అవుతామని బాబా భక్తులు విశ్వసిస్తారు. గురుస్తాన్ లో బాబా చిత్ర పాఠం పెద్దది, ఓ చిన్న శ్లోకం చెక్కి వున్నాయి.భక్తులు, యాత్రికులు ఈ ప్రదేశాన్ని ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శించవచ్చు.