కావేరి నది ఒడ్డున శ్రీరంగ పట్నానికి సమీపంలో రంగనాధ తిట్టు బర్డ్ శాంక్చువరీ కలదు. పర్యాటకులు దీనిని తప్పక చూడాలి. ఆరు ద్వీపాలచే నిర్మించబడిన ఈ శాంక్చువరీ షుమారు 67 చ.కి.మీ. ల విస్తీర్ణంలో ఉంది. 1940 లో దీనిని బర్డ్ శాంక్చువరీ గా ప్రకటించారు. ఈ ప్రదేశాన్ని చూచేందుకు జూన్ నుండి అక్టోబర్ నెలలు అనుకూలం. ఈ శాంక్చురీకి అనేక రకాల పక్షులు వలసలు వస్తూ ఉంటాయి. పర్యాటకులు స్ధానికంగా ఉండే అనేక పక్షులను గమనించి ఆనందపడవచ్చు. ఇక్కడి ద్వీపాలలో బోటు విహారం కూడా చేయవచ్చు. పర్యాటకులు శాంక్చురీని ఉదయం 9 గం. నుండి సాయంత్రం 6 గం. వరకు చూడవచ్చు. టికెట్ ఖరీదు రూ.50 భారతీయులకు, రూ.300 విదేశీయులకు ఉంటుంది. పర్యాటకులు బోటు విహారానికి రూ.50 భారతీయులకు, రూ.300 విదేశీయులకు చెల్లించాలి.