శివాజీ స్ఫూర్తి కేంద్రం శ్రీశైలం లో ఒక క్రీడల కేంద్రం గా వుంది. ఈ సెంటర్ కు మారాట్టా యోధుడు శివాజీ పేరు పెట్టారు. ఈ సెంటర్ చేరాలంటే, సుమారు 30 మెట్లు ఎక్కవలసి వుంటుంది. సెంటర్ యొక్క భవనం ఆకర్షణీయంగా వుండి దానిలో శివాజీ విగ్రహం ఒక సింహాసనం పై కూర్చుని వుంటుంది. ఈ సెంటర్ చుట్టూ అన్నివైపులా సంరక్షణ చేయబడి అక్కడ నుండి లోయ లోని ప్రకృతి దృశ్యాలు మరియు దూరంగా వుండే శ్రీ శైలం డాం ని చూచి ఆనందించేలా వుంటుంది.
ఈ క్రీడల కేంద్రాన్ని , రాష్ట్రం లోని క్రీడల లో అన్ని వయసుల పిల్లలు పాల్గొనేందుకు గాను శిక్షణ ఇచ్చేందుకు స్థాపించారు. చాలా మంది తమ పిల్లలని ఈ కేంద్రానికి పంపుతారు. క్రికెట్, ఫుట్ బాల్ , టెన్నిస్ , బాడ్మింటన్ వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి క్రీడలలో ఈ కేంద్రం లో ట్రైనింగ్ పొందిన పిల్లలు చాల మంది పాల్గొన్నారు.