శ్రీశైలం డాం ని ప్రధాన శ్రీశైలం పట్టణానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో కృష్ణా నది పై కట్టారు. వ్యూహాత్మకంగా దీనిని నల్లమల కొండలలో ఒక లోతైన మలుపు లో నిర్మించారు. ఈ డాం ఇండియా లో రెండవ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ గా పేరొందినది. శ్రీశైలం డాం ప్రాజెక్ట్ ని 1960 వ సంవత్సరం లో నిర్మాణం మొదలు పెట్టగా, దానిని పూర్తిచేసేందుకు సుమారు 20 సంవత్సరాలు పట్టింది. చివరకు ఇది 770 మెగా వాట్ల విద్యుత్ ఉత్పతి సామర్ధ్యం కలిగి ఒక బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ గా రూపొందింది. నేడు ఈ డాం సుమారు 2,200 చదరపు కిలోమీటర్ల భూమిని సాగు చేస్తోంది.
ఈ రిజర్వాయర్ నీటి నిలువకు విద్యుత్ అవసరం లేనందున అధిక మొత్తాలలో నీటిని ఇక్కడ నిలువ చేస్తారు. వరదలు వచ్చినపుడు, శ్రీశైలం రిజర్వాయర్ చాలా త్వరగా నిండిపోయి మిగిలిన నీరు నాగార్జునసాగర్ డాం లోకి ప్రవహిస్తుంది. వరద నీటిని పవర్ జనరేషన్ కు ఉపయోగించరు.