విమాన మార్గం ద్వారా: సుచింద్రం దగ్గరలో త్రివండ్రుం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉన్నది. ఇది కన్యాకుమారి పట్టణం నుండి 87 కి. మీ. దూరంలో ఉన్నది. ఇండియా లోని పెద్ద నగరాల నుండి మరియు గల్ఫ్ దేశాలనుండి కూడా ఈ విమానాశ్రయానికి, విమానాలు ఉన్నాయి. ఎయిర్ పోర్ట్ నుండి మీరు టాక్సీ తీసుకుని కన్యాకుమారి లేదా సుచింద్రం వరకు వెళ్ళవొచ్చు. కన్యాకుమారి వరకు టాక్సీ ఖర్చు సుమారు రూ.1500/- అవుతుంది.