ఒప్పిలియప్పన్ ఆలయం తిరునగేశ్వరం నుండి అర కిలోమీటర్ దూరంలో కుంబకోణం నగరానికి దక్షిణాన సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెరుమాళ్ నూట ఎనిమిది దివ్యదేశాలలో ఈ ఆలయం ఒకటి, భూమాదేవి పుట్టిన ప్రాంతం (అవతార స్థలం). ఈ ఆలయంలో ప్రధాన దైవం పెరుమాళ్ (విష్ణువు) ను ఒప్పిలియప్పన్ గా పూజిస్తారు, ఆయన సహచరి భూమాదేవి. ఈ ఆలయం 2000 ఏళ్ళ కిందటిది. నాగనాథ స్వామి ఆలయం ఈ ఆలయానికి దగ్గరగా ఉంది. ఈ ఆలయంలో నైవేద్యాలు (ఆహార అర్పణలు) ఉప్పు లేకుండా వండుతారు, ఎవరైనా ఆలయానికి ఉప్పుతో కూడిన ఆహారం తీసుకుని రావడం కూడా పాపంగా పరిగణిస్తారు.
ఈ ఆలయంలో భూమదేవిని, పెరుమాళ్ దేవుని పూజిస్తే అతను లేదా ఆమె తన జీవిత భాగస్వామి పట్ల సహనంతో ఉంటారని వారి వైవాహిక జీవితం సామరస్య పూర్వకంగా ఉంటుందని అంటారు.
ఒప్పిలియప్పన్ ఆలయంలో ప్రధాన పండుగ అయిపసి (అక్టోబర్, నవంబర్), పురత్తసి (సెప్టెంబర్, అక్టోబర్) పంగుని (మార్చ్, ఏప్రిల్) నెలలలో జరిగే బ్రహ్మోత్సవ౦.



Click it and Unblock the Notifications