మహిళలు నిర్మించిన ప్రసిద్ధ స్మారక కట్టడాలు ఎక్కడో తెలుసా..
భారతదేశం దాని సంస్కృతి మరియు కళలకు ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ ప్రపంచం నలుమూలల నుండి ప్రజలను ఆకర్షిస్తుంది. భిన్నత్వంతో నిండిన ఈ దేశంలో విభిన్న సంప్రదాయాలు ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ ఉన్న అనేక భవనాలు మరియు స్మారక చిహ్నాలు నేటికీ చూడొచ్చు. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అందమైన మరియు చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి చెందింది.
భారతదేశం, వైవిధ్యాల దేశం, దాని కళ సంస్కృతి మరియు సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశపు గొప్ప చరిత్రను తెలియజేసే అనేక భవనాలు ఇక్కడ ఉన్నాయి. భారతదేశంలో ఉన్న చాలా భవనాలు లేదా స్మారక చిహ్నాలు పురుషులు నిర్మించినవి. కానీ స్త్రీలు నిర్మించిన కొన్ని భవనాలు మరియు స్మారక చిహ్నాలు ఉన్నాయని మీకు తెలుసా. వాటి గురించి తెలియకపోతే, ఇప్పుడు తెలుసుకుందాం పదండి. భారతదేశంలో మహిళలు నిర్మించిన ప్రసిద్ధ స్మారక కట్టడాలు..

హుమాయున్ సమాధి, ఢిల్లీ
ఢిల్లీలోని హుమాయున్ సమాధిని నిర్మించింది ఒక స్ర్తీ. హుమాయూన్ భార్య హమీదా బాను బేగం దీనిని పర్షియన్, భారతీయ శైలుల్నీ కలగలిపి నిర్మించింది. ఎర్రరాతితో కట్టిన ఈ సమాధి భారత ఉపఖండంలోనే మొదటి ఉద్యానవన సమాధి. ఈ సమాధిని 16వ శతాబ్దంలో నిర్మించారు. ఇక జాతీయ వారసత్వ సంపద జాబితాలో ఉన్న చారిత్రక కట్టడం ఇది. అత్యంత సువిశాల స్థలంలో మొఘల్ చక్రవర్తి అయిన హుమాయున్ సమాధి విస్తరించి ఉంది. 30 ఎకరాల ప్రాంతంలో సమాధి ఉంది. చుట్టూ 200 ఎకరాలకు పైగానే హుమాయున్ చారిత్రక కాంప్లెక్స్ విస్తరించి ఉంది. ఇది భారతదేశంలోని మొఘల్ వాస్తుశిల్పానికి తొలి ఉదాహరణలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

ఇత్మద్-ఉద్-దౌలా, ఆగ్రా
ఆగ్రాలోని ఈ సమాధిని నూర్జహాన్ 17వ శతాబ్దంలో తన తండ్రి మీర్జా ఘియాస్ బేగ్ జ్ఞాపకార్థం నిర్మించారు. తాజ్ మహల్ను పోలి ఉన్నందున, దీనిని తరచుగా "బేబీ తాజ్ మహల్" అని కూడా పిలుస్తారు. క్రీస్తుశకం 1625లో నిర్మించబడిన ఇత్మద్ ఉద్ దౌలా సమాధి, తాజ్ మహల్ నిర్మాణ సమయంలో అనేక విశేషాలను కలిగి ఉంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ స్మారక చిహ్నంపై చెక్కిన శిల్పాలు తాజ్ కంటే మెరుగ్గా ఉన్నాయని చెబుతారు. ఇతిమద్-ఉద్-దౌలా సమాధి పాలరాతిలో వెండి ఆభరణాల పెట్టెను పోలి ఉంటుంది.

రాణి కి వావ్, పటాన్
గుజరాత్లోని పటాన్ నగరంలో ఉన్న ఈ మెట్ల బావిని 11వ శతాబ్దంలో రాణి ఉదయమతి నిర్మించించారు. రాణి ఉదయమతి చౌళుక్య రాజు అయిన భీమ I రాజు భార్య. ఆయన జ్జపాకార్థం ఈ సమాధిని నిర్మించారు. ఇది UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేర్చబడింది. అంతేకాకుండా ఇది భారతదేశంలోని అత్యంత అందమైన మెట్ల బావులలో ఒకటిగా కూడా ప్రసిద్ధిగాంచింది. దీనిని క్వీన్స్ స్టెప్వెల్ అని కూడా పిలుస్తారు.

విరూపాక్ష దేవాలయం, పట్టడకల్
ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో కర్ణాటకలోని పట్టడకల్ పట్టణంలో రాణి లోకమహాదేవి నిర్మించారు. ఇది శివునికి అంకితం చేయబడింది మరియు చాళుక్యుల నిర్మాణ శైలిలో అత్యంత ముఖ్యమైన ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధిచెందింది. లోకమహాదేవి తన భర్త విక్రమాదిత్య II పల్లవులపై సాధించిన విజయానికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించింది.

లాల్ దర్వాజా మసీదు, జౌన్పూర్
ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో ఉన్న ఈ చారిత్రాత్మక మసీదును 1447లో సుల్తాన్ మహమూద్ షర్కీ రాణి రాజే బీబీ నిర్మించారు. ఈ మసీదు సెయింట్ సయ్యద్ అలీ దావూద్ కుతుబుద్దీన్కు అంకితం చేయబడింది. దీని రూపకల్పన మరియు శైలి 'అతలాల మసీదు'ని పోలి ఉంటుంది.



Click it and Unblock the Notifications












