Search
  • Follow NativePlanet
Share
» »అయోధ్య వెళ్లాల‌నుకుంటున్నారా..? అయితే, ఈ టూర్ ప్యాకేజీని అస్స‌లు మిస్ కాకండి..

అయోధ్య వెళ్లాల‌నుకుంటున్నారా..? అయితే, ఈ టూర్ ప్యాకేజీని అస్స‌లు మిస్ కాకండి..

త్వ‌ర‌లోనే వేస‌వి సెల‌వులు రాబోతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో చాలామంది విహ‌రయాత్రల‌కు వెళ్లాల‌ని ప్లాన్ చేస్తుంటారు. మ‌రికొంద‌రైతే పుణ్య‌క్షేత్రాల‌కు వెళ్లాల‌ని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికోసం ఐఆర్‌సిటిసీ ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీని అందిస్తోంది. దేశంలోని ప్ర‌సిద్ధిచెందిన పుణ్య‌క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో అయోధ్య ఒకటి. అయోధ్య రామాల‌యం సంద‌ర్శించాల‌ని అనుకునేవారికి ఇదొక సువ‌ర్ణ‌వ‌కాశం. అయోధ్య‌తోపాటు మ‌రికొన్ని పుణ్య‌క్షేత్రాల‌ను తిల‌కించొచ్చు.

భారతీయ రైల్వే ప్ర‌యాణికుల కోసం అద్భుతమైన ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ఆధ్యాత్మిక‌ యాత్రలో, అయోధ్యతోపాటు, గయ, ప్రయాగ్‌రాజ్, పూరి మ‌రియు వారణాసి వంటి పుణ్య‌క్షేత్రాల‌ను తిల‌కించొచ్చు. ఈ టూర్ ప్యాకేజీకి అయ్యే ఖ‌ర్చులు, ఎన్నిరోజులు అనే విష‌యాల‌న్నీ ఇప్ప‌డు తెలుసుకుందాం.

భారతీయ రైల్వేలతో ప్రతి ప్రయాణం ఎంతో చిరస్మరణీయంగా ఉంటుంది. అందుకే IRCTC ఎప్పటికప్పుడు ప్రయాణీకుల కోసం స‌రికొత్త టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈసారి కూడా IRCTC దేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాల ఉమ్మడి ప్యాకేజీని ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం ప్రారంభించింది. ఈ టూర్ ప్యాకేజీలో, బడ్జెట్‌కు అనుగుణంగా స‌రిప‌డే, సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌యాణాన్ని ఆస్వాదించొచ్చు.

ayodhyarammandir1

IRCTCతో ఐదు ప్రధాన పుణ్యక్షేత్రాలకు ప్రయాణం..

IRCTC అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఈ టూర్ ప్యాకేజీలో, అయోధ్య, గయా, ప్రయాగ్‌రాజ్, పూరి మరియు వారణాసికి భారత్ గౌరవ్ టూరిస్ట్ స్పెషల్ ట్రైన్ ఓ సరికొత్త ప్ర‌యాణాన్ని అందిస్తోంది. ఈ ప్రయాణం హైదరాబాద్/సికింద్రాబాద్ నుండి ప్రారంభమవుతుంది. తిరిగి గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ మీదుగా పూరీ-కోణార్క్ మీదుగా హైదరాబాద్‌లో ఆగుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో ప‌ది రోజులు, తొమ్మిది రాత్రుల ప‌ర్య‌ట‌న ఉంటుంది.

ఏప్రిల్ 6వ తేదినుంచి ప్రారంభ‌మైన ఈ ప్ర‌యాణం ఏప్రిల్ 15వ తేది వ‌ర‌కు కొనసాగుతుంది. ఇక‌, ఈ టూర్ ప్యాకేజీలో, ప్ర‌యాణికులు బడ్జెట్ ప్రకారం రూ. 16,500 నుండి రూ. 33,630 వరకు ఉన్న ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు, ఇందులో రైలు, బస్సు మరియు కారు మొదలైన ఖర్చులు మరియు హోటల్ ఖర్చులు ఉంటాయి.

ayodhyahanumanghari1

IRCTC ప్రయాణ బీమా సౌక‌ర్యం..

ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, IRCTC అల్పాహారం నుండి భోజనం మరియు రాత్రి భోజనం వరకు పూర్తి ఏర్పాట్లు చేస్తోంది. దీంతో పాటు, ప్రయాణీకులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ మరియు టూర్ మేనేజర్ సదుపాయం కూడా క‌ల్పిస్తోంది. ఈ టూర్ మేనేజ‌ర్ ప్రయాణ సమయం మొత్తంలో ప్రయాణికులతోనే క‌లిసి ఉంటారు. ఈ టూర్ ప్యాకేజీలో, ప్రయాణికులు తమ సౌలభ్యం ప్రకారం స్లీపర్ క్లాస్, 3AC మరియు 2AC రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో, రవాణా కోసం ప్రత్యేక ఏసీ లేదా నాన్-ఏసీ వాహనాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి.

పిల్లల కోసం ప్రత్యేక బుకింగ్..

ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకునే ప్రయాణికులు హోటల్‌లో ఏసీ లేదా నాన్-ఏసీ గదులను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. డబుల్ లేదా ట్రిపుల్ షేరింగ్ రూమ్‌లను కూడా బుక్ చేసుకోవచ్చు.ఇక‌, ఈ ప్ర‌యాణంలో పిల్లలు కూడా ఉంటే, ఐదు నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు వ్యక్తిగత బుకింగ్ చేయవలసి ఉంటుంది. IRCTCతో అందిస్తోన్న ఈ పుణ్య‌క్షేత్రాల యాత్ర‌లో మీరు కూడా పాల్గొనాల‌న‌ల‌నుకుంటే మాత్రం ఐఆర్‌సిటిసి అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ లేదా ఇతర సమాచారాన్ని పొందొచ్చు.

More News

Read more about: irctc tour package ayodhya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+