Search
  • Follow NativePlanet
Share
» »అయోధ్య ద‌ర్శ‌నం చేసుకోవాల‌నుకుంటున్నారా..? అయితే, ఈ ప్యాకేజీ మీకోస‌మే..!

అయోధ్య ద‌ర్శ‌నం చేసుకోవాల‌నుకుంటున్నారా..? అయితే, ఈ ప్యాకేజీ మీకోస‌మే..!

ఐఆర్‌సిటిసి ప‌ర్యాట‌కుల కోసం నిత్యం ఏదో ఒక టూర్ ప్యాకేజీల‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఆధ్యాత్మిక ప్ర‌దేశాల‌తో పాటు, చారిత్ర‌క క‌ట్ట‌డాలకు ప్యాకేజీలను అందిస్తోంది. దేశంలోని ప్ర‌సిద్దిచెందిన అయోధ్య రామ‌య్య ద‌ర్శ‌నం చేసుకోవాల‌నుకునే భ‌క్తుల‌కు ఐఆర్‌సిటిసి ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా అయోధ్య బాల‌రాముని ద‌ర్శ‌నంతోపాటు కాశీ విశ్వ‌నాథుడిని కూడా ద‌ర్శించుకోవ‌చ్చు. ఈ టూర్ ప్యాకేజీ హోలీ ఉత్తర్​ప్రదేశ్​ యాత్ర పేరుతో ఆప‌రేట్ అవుతోంది. ఈ ప్యాకేజీలో భాగంగా హైదార‌బాద్ నుంచి ప్ర‌యాణం ఉంటుంది. ఈ టూర్‌లో వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్​ వంటి ప్రదేశాలను సంద‌ర్శించొచ్చు. ఈ టూర్​ మొత్తంగా ఐదు రాత్రులు, ఐదు ప‌గ‌ళ్ల‌తో ఉంటుంది. ఆదివారం ఈ టూర్ ప్రారంభ‌మవుతుంది.

టూర్ షెడ్యూల్ ఇదే...

ప్యాకేజీలో భాగంగా మెదటి రోజు ఉదయం 9:25 గంటలకు సికింద్రాబాద్‌లో 12791 అనే నెంబ‌ర్‌గ‌ల దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ ప్రారంభమవుతుంది. ఆ రోజు నైటంతా జ‌ర్నీ ఉంటుంది. ఇక‌, రెండో రోజు మధ్యాహ్నానికి వారణాసి చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కు వెళ్తారు. అక్కడ చెకిన్​ అయ్యాక‌ ఆ రోజు సాయంత్రం కాశీ విశ్వనాథుని పుణ్యక్షేత్రం, గంగ హారతి చూస్తారు. ఆ నైటంతా వారణాసిలోనే స్టే చేస్తారు. మ‌రుస‌టి రోజు అల్పాహారం ముగించుకుని వార‌ణాసిలో ఆల‌యాల‌ను చూస్తారు.

ayodhya rammandir

కాశీ విశ్వనాథ ఆలయం, కాలభైరవ్‌ మందిర్‌, బిర్లా మందిర్ల సంద‌ర్శ‌న ఉంటుంది. అనంతరం అయోధ్యకు ప్ర‌యాణం మొద‌లుపెడ‌తారు. అయోధ్య హోటల్​లో చెకిన్​ అయ్యాక‌, ఆ నైటంతా స్టే చేస్తారు. నాలుగో రోజు బ్రేక్‌ఫాస్ట్ అయ్యాయ‌క అయోధ్య ఆలయం, హనుమంతుని దర్శనం, దశరథ్‌ మహల్‌ను సంద‌ర్శ‌న ఉంటుంది. మధ్యహ్నం ప్రయాగరాజ్​కు బయలుదేరి నైట్​ అక్క‌డే స్టే చేస్తారు. ఇక‌, ఐదో రోజు తెల్లవారుజామున త్రివేణి సంగమ సంద‌ర్శ‌న ఉంటుంది. అక్కడి నుంచి హోటల్​కి వచ్చి టిఫిన్ చేశాక‌, మధ్యాహ్నం హోటల్​ నుంచి చెక్​ అవుట్ అవుతారు. అనంత‌రం ఆనంద్​ భవన్​, ఖుస్రో బాగ్ సంద‌ర్శ‌న ఉంటుంది. అదే రోజు సాయంత్రానికి ప్రయాగరాజ్​ రైల్వే స్టేషన్​ వెళ్తారు. రాత్రి 7:45నిమిషాలకు సికింద్రాబాద్‌కు ట్రైన్​ బయలుదేరుతుంది. ఆ నైటంతా ప్ర‌యాణం ఉంటుంది. ఇక‌, ఆరో రోజు రాత్రి 9:30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో ఈ ప్యాకేజీ ముగుస్తోంది.

ayodhya2 deepam

టూర్ ధ‌ర‌లివే..

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. కంఫర్ట్ క్లాస్​లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 41,460/ చెల్లించాల్సి ఉంటుంది. అదే ట్విన్​ షేరింగ్ అయితే రూ. 24,530గా నిర్ణియించారు. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 19,840 చెల్లించాల్సి ఉంటుంది. ఇక‌, ఐదు నుంచి ప‌ద‌కొండేళ్ల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ. 14,780 ఉంటుంది. విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ. 13,540చెల్లించాలి.

ఇక స్టాండర్డ్ క్లాస్​ విష‌యానికి వ‌స్తే.. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 21,990 చెల్లించాలి. ట్విన్​ షేరింగ్​కు రూ. 17,410 గా నిర్ణ‌యించారు. అదే ట్రిపుల్ ఆక్యుపెన్సీకయితే రూ.16,830 చెల్లించాల్సి ఉంటుంది. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ. 13వేలు క‌ట్టాల్సి ఉంటుంది. విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ. 11,760 ఉంటుంది.

chitrakoot

అద‌న‌పు సౌక‌ర్యాలు..

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ప‌ర్యాట‌కులు 3 ఏసీ/ స్లీపర్‌ క్లాస్‌ల‌ను ఎంచుకోవ‌చ్చు. ప్యాకేజీని బట్టి స్థానికంగా ప్రయాణానికి ఏసీ గదులు, వాహనాన్ని వారే ఏర్పాటు చేస్తారు. మూడు రోజులకు గాను బ్రేక్​ఫాస్ట్​, డిన్నర్​ వారే అందుబాటు క‌ల్పిస్తారు. ప్యాకేజీ బుక్ చేసుకున్న‌వారికి ట్రావెల్​ ఇన్సూరెన్స్​ కూడా ఉంటుంది. పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ఎంట్రీ ఫీజులు ఉంటే మాత్రం సందర్శకులే చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్​ ప్యాకేజీ సెప్టెంబర్​ 22, అక్టోబర్​ 6, 13, 20, 27వ తేదీలలో ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులో ఉంటాయి. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్‌ కోసం ఐఆర్‌సిటిసి అధికారిక వెబ్‌సైట్‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది.

More News

Read more about: irctc tour package ayodhya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+