భారతీయులు కూడా ప్రవేశించలేని ఈ నగరాలను ఎప్పుడైనా చూశారా?
భారతదేశం సాంస్కృతిక వైవిధ్యం, గొప్ప వారసత్వం కలిగిన దేశం. ఇలాంటి ఈ దేశంలోని కొన్ని రాష్ట్రాలను సందర్శించాలంటే మాత్రం ప్రత్యేక అనుమతి అవసరం. దాన్నే ఇన్నర్ లైన్ పర్మిషన్ అంటారు. ఇంతకు ఆ ఇన్నర్లైన్ పర్మిషన్ అంటే ఏంటి? ఆ పర్మిషన్తో వీక్షించే నగరాలేంటో మనమిప్పుడు చూద్దాం.
ఇన్నర్ లైన్ అనుమతి అంటే ఏమిటి?
ఇది కొత్త నియమం కాదు. కానీ చాలా కాలంగా ఉంది. ప్రజలు ఇతర దేశాలతో సరిహద్దులను పంచుకునే ప్రాంతాలకు ప్రయాణిస్తున్నప్పుడు ఈ అనుమతి తప్పనిసరిగా అవసరం. ఇది పర్యాటకుల భద్రతకు సహాయపడుతుంది. ఆ ప్రదేశాలెంటో చూద్దాం.

అరుణాచల్ ప్రదేశ్
సంస్కృతితో సమృద్ధిగా ఉన్న ఈ ఈశాన్య రాష్ట్రం చైనా, భూటాన్ మరియు మయన్మార్లతో సరిహద్దును పంచుకుంటుంది. ఈ ప్రాంతానికి వెళ్లాలనుకునేవారు మాత్రం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ రెసిడెంట్ కమీషనర్ నుండి మాత్రం అనుమతిని పొందాలి. కోల్కతా, షిల్లాంగ్, గౌహతి మరియు ఢిల్లీ నుండి వీటిని పొందొచ్చు. ఈ అందమైన రాష్ట్రంలోని కొన్ని ప్రదేశాలను రక్షించడానికి, ILP (ఇన్నర్లైన్ పర్మిషన్) తీసుకొచ్చారు. ఇది ఒక వ్యక్తికి 100 రూపాయల దాకా ఖర్చు అవుతుంది, దీనిని 30 రోజుల వరకు ఉపయోగించవచ్చు.
నాగాలాండ్
అనేక తెగలకు నిలయమైన ఈ రాష్ట్రం మయన్మార్తో సరిహద్దును పంచుకుంటుంది. అందుకే ఇక్కడి ప్రాంతాలు ముఖ్యంగా పర్యాటకులకు సున్నిత ప్రాంతాలుగా పరిగణిస్తారు. నాగాలాండ్ని సందర్శించడానికి, అక్కడి డిప్యూటి కమీషనర్ నుండి ILP తీసుకోవాలి, దీనిని ఢిల్లీ, కోల్కతా, కోహిమా, దిమాపూర్, షిల్లాంగ్ మరియు మోకోక్చుంగ్ నుండి పొందవచ్చు.

లక్షద్వీప్
ఈ ప్రదేశం అందమైన బీచ్లు, స్వచ్ఛమైన నీలిరంగు నీరు, రుచికరమైన ఆహారానికి ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ కేంద్రపాలిత ప్రాంతంలోకి ప్రవేశించడానికి మీకు ప్రత్యేక అనుమతి, పోలీసుల నుండి క్లియరెన్స్ సర్టిఫికేట్ అవసరం. ఈ పర్మిషన్ ఉంటే గనుక ఈ ప్రాంతాన్ని వీక్షించేయొచ్చు.
మిజోరం
భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలోని మరో అందమైన రాష్ట్రం మిజోరాం. ఈ ప్రాంతం మయన్మార్ మరియు బంగ్లాదేశ్తో సరిహద్దులను పంచుకుంటుంది. ఈ రాష్ట్రం అనేక తెగలకు నిలయం కూడా. ఇక్కడ ప్రయాణానికి ఐఎల్పిని మిజోరాం ప్రభుత్వ లైజన్ ఆఫీసర్ నుండి పొందవచ్చు, దీనిని సిల్చార్, కోల్కతా, షిల్లాంగ్, ఢిల్లీ మరియు గౌహతి నుండి పొందొచ్చు. విమాన ప్రయాణం గనుక అయితే ఐజ్వాల్ చేరుకున్నప్పుడు విమానాశ్రయ భద్రతా అధికారి నుండి ప్రత్యేక పాస్ను తీసుకోవాల్సి ఉంటుంది.

సిక్కిం
సిక్కిం అందమైన మైదానాలు, రుచికరమైన వంటకాలు, అనేక మఠాలు, క్రిస్టల్ సరస్సులు, సుందరమైన దృశ్యాలతో కూడిన రాష్ట్రం. భారతదేశంలోని అతి చిన్న రాష్ట్రాలలో ఒకటి సిక్కిం. ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు, ప్రజలు తరచూ ఎత్తైన ప్రదేశాన్ని అధిరోహించాలని కోరుకుంటారు, దీనికి అనుమతి అవసరం. త్సోమ్గో బాబా ఆలయ యాత్ర, సింగలీలా ట్రెక్, నాథలా పాస్, ద్జోంగ్రీ ట్రెక్, థంగు-చోప్తా వ్యాలీ యాత్ర, యుమెసమ్డాంగ్, యుమ్తాంగ్ మరియు జీరో పాయింట్ యాత్ర మరియు గురుడోగ్మార్ సరస్సు కోసం ప్రత్యేక పాస్లు తప్పనిసరిగా అవసరం. ఈ పర్మిట్ను పర్యాటక మరియు పౌర విమానయాన శాఖ జారీ చేస్తుంది, దీనిని బాగ్డోగ్రా విమానాశ్రయం మరియు రంగపో చెక్పోస్ట్ నుండి సేకరించవచ్చు.
మరెందుకాలస్యం ఈ పర్మిట్తో భారతదేశంలో ఈ అందమైన నగరాలను ఓసారి చూసేయండి.



Click it and Unblock the Notifications













