రాఖీ పండుగ సందర్భంగా ఇండియాలోని ఈ ప్రాంతాలకు వెళ్లండి..!
రక్షా బంధన్ దగ్గరలోనే ఉంది. ఇది భారతదేశంలోని ముఖ్యమైన పండుగ. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. తోబుట్టువులు సరదాగా గడపడేందుకు భారతదేశంలో చాలా ప్రదేశాలే ఉన్నాయి. ఈ పండుగ సందర్భంగా అన్నాచెల్లెలు, అక్కాతమ్ముడు కలిసి విహరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంటారు చాలామంది. రోజంతా బిజిబిజిగా గడిపే ఈ సమయంలో రక్షాబంధన్ నాడైనా ఖచ్చితంగా మీవారితో కుటుంబసభ్యులతో కలిసి విహరించేందుకు కాస్త సమయం కేటాయించడం ఉత్తమం. అందుకోసం ఇండియాలోని కొన్ని ఉత్తమమైన ప్రదేశాలను ఇప్పుడు చూద్దాం. రక్షాబంధన్ నాడు సందర్శించేందుకు అనువైన ప్రదేశాలు ఇవే..

గోవా
గోవా భారతదేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రాంతం బీచ్లు, వాటర్ స్పోర్ట్స్, నైట్ లైఫ్లను ఇష్టపడే తోబుట్టువులకు ఇది ఎంతో ఉత్తమమైనదనే చెప్పుకోవచ్చు. ఇక్కడ బాగా బీచ్, కలంగుట్ బీచ్ వంటి వివిధ బీచ్లను చూస్తూ సరదాగా విశ్రాంతి తీసుకోవచ్చు. అంతేకాకుండా, స్కూబా డైవింగ్, పారాసైలింగ్ మరియు జెట్-స్కీయింగ్ వంటి నీటి కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు. ఇంకా, ఇక్కడ తోబుట్టువులతో గోవాన్ ఫిష్ కర్రీ, రోజ్ ఆమ్లెట్ మరియు గోవాన్ విందాలూ వంటి రుచికరమైన గోవా వంటకాలను కూడా ఓ పట్టుపట్టేయొచ్చు.
జైపూర్
సంస్కృతి, చరిత్ర మరియు వాస్తుశిల్పాన్ని ఇష్టపడే సోదరులు, సోదరీమణులకు పింక్ సిటీ జైపూర్ సరైన ప్రదేశమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఇక్కడ చరిత్రకు సంబంధించిన ఎన్నో కోటలు ఉన్నాయి. అలాగే సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉండే ఈ ప్రాంతంలో సిటీ ప్యాలెస్, హవా మహల్, జంతర్ మంతర్ మరియు నహర్ఘర్ కోట వంటి అనేక ప్రదేశాలను చూడొచ్చు. అలాగే, తోబుట్టువులతో కలిసి ఇక్కడ రాజస్థానీ రుచికరమైన ప్యాజ్ కచోరీ, రాజస్థానీ థాలీ మరియు దాల్ బాతి చుర్మా వంటి వంటకాల రుచిని కూడా ఆస్వాదించొచ్చు.

రిషికేశ్
సాహస కార్యకలాపాలను, ఆధ్యాత్మికతను ఇష్టపడే తోబుట్టువులకు రిషికేశ్ గొప్ప ప్రదేశం. ఇక్కడ రివర్ రాఫ్టింగ్, బంగీ జంపింగ్, రాక్ క్లైంబింగ్ మరియు ట్రెక్కింగ్ వంటి కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. రిషికేశ్లోని వివిధ దేవాలయాలు మరియు ఆశ్రమాలను కూడా సందర్శించవచ్చు. అంతేకాకుండా, గంగా నది ఒడ్డున సాయంత్రం గంగా ఆరతికి హాజరు కావచ్చు. అలాగే, ఇక్కడ క్లాసిక్ మసాలా చాయ్, ఆలూ పూరీ మరియు చోలే భాతురేని వంటి రుచులను కూడా టేస్ట్ చేయొచ్చు.
ఆగ్రా
రక్షా బంధన్ నాడు సందర్శించేందుకు ఆగ్రా సరైన గమ్యస్థానం. చరిత్ర గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు తప్పకుండా ఈ ప్రాంతానికి వెళ్లాల్సిందే. తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్, ఫతేపూర్ సిక్రీలను ఇక్కడ సందర్శించవచ్చు. ఇక్కడి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల అందాలను చూసి ఆశ్చర్యపోతారు. తోబుట్టువులతో కలిసి ఆగ్రాలోని రుచికరమైన మొఘలాయ్ వంటకాలను కూడా ఆస్వాదించవచ్చు. అలాగే, ఆగ్రా కా పేట, బెదాయి, జలేబీ, రబ్రీల కాంబోని తప్పనిసరిగా ఒక్కసారైనా ప్రయత్నించాల్సిందే..

కేరళ
పచ్చని ప్రకృతి నడుమ విహరించాలనుకునే వారు తప్పకుండా రక్షాబంధన్ నాడు కేరళను సందర్శించాల్సిందే. వన్యప్రాణులు, ప్రకృతి సౌందర్యాన్ని ఇష్టపడే తోబుట్టువులకు కేరళ సరైన గమ్యస్థానం. ఇక్కడ అలెప్పి బ్యాక్ వాటర్స్, మున్నార్లోని సుగంధ ద్రవ్యాల తోటలు, పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ వంటి వన్యప్రాణుల అభయారణ్యాలను సందర్శించొచ్చు. అలాగే, ఇక్కడి కేరళ వంటకాలైనా ఇడ్లీ సాంబార్తో పాటు, అప్పం స్టూ, మీన్ వరుతత్తు (కేరళ స్టైల్ ఫిష్ ఫ్రై), పుట్టు మరియు కదల కర్రీని వంటి వంటకాలను ఓసారి ట్రై చేయొచ్చు.



Click it and Unblock the Notifications















