ఇండియాలోని ఈ హిల్స్టేషన్లను సందర్శించారా?
భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ పర్యాటకుల సమూహం కనిపిస్తుంది. వేసవి కాలం ప్రారంభమైంది. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఎక్కడికో వెళ్లి తమ వేసవి సెలవులను ఉత్తమంగా గడపాలని ప్లాన్ చేసుకుంటుంటారు. ఈ సెలవుల్లో హిల్స్టేషన్లు ఉత్తమమైనవి. ఈ రోజు మేము మీకు అటువంటి హిల్ స్టేషన్ల గురించి సమాచారాన్ని అందిస్తున్నాము. వాటి గురించి బహుశా మీరు విని ఉండకపోవచ్చు. మరెందుకాలస్యం వాటి గురించి తెలుసుకుందాం పదండి.

రెవల్సార్
ఢిల్లీకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మండి జిల్లాలో ఉన్న ఈ ప్రదేశాన్ని సిటీ ఆఫ్ లేక్స్ అని పిలుస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు, ఇది పర్యాటకులకు ఒక ఆఫ్బీట్ డెస్టినేషన్. కానీ ఇప్పుడు నెమ్మదిగా ప్రజలు దాని గురించి తెలుసుకోవడమే కాకుండా, అది వారి ఇష్టమైన గమ్యస్థానంగా కూడా మారింది. హిందూ, బౌద్ధ మరియు సిక్కు వర్గాల ప్రజలకు మతపరమైన ప్రదేశంగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఢిల్లీకి సమీపంలో ఉన్న ఈ ప్రదేశం ఆధ్యాత్మిక కొండగా మారింది.
గుషాయిని
గుషాయిని కులు జిల్లాలో ఉన్న చాలా ప్రశాంతమైన గ్రామం. ఇది సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తులో ఉంది. ఢిల్లీ నుండి 550 కిలోమీటర్లలో ఉన్న ఈ గ్రామం గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్కి చాలా దగ్గరగా ఉంది. అంతేకాకుండా ఈ ప్రాంతపు అందాన్ని వీక్షించేందుకు పర్యాటకులు తరలి వస్తుంటారు.

నౌకుచియాటల్
నైనిటాల్ లాగా కనిపించే ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉండటమే కాకుండా, చుట్టూ పచ్చదనం మరియు ప్రశాంతమైన వాతావరణంతో ఈ ప్రాంతం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇక్కడికి సమీపంలో ఉంటే సరస్సులో బోటింగ్ను కూడా ఆస్వాదించవచ్చు. ఈ ప్రాంతంలో రెండు నుండి మూడు రోజుల పాటు ఉండేలా ప్రణాళికను సిద్ధం చేసుకోవచ్చు. ఇక్కడ అందమైన ప్రకృతి దృశ్యాలను చూడటమే కాకుండా వివిధ రకాల పక్షులు, వన్యప్రాణులు మిమ్మల్ని సాదరంగా ఆహ్వనం పలుకతాయి.
నౌకుచియాటల్ ఉత్తరాఖండ్లోని ఒక సుందరమైన లేక్ గ్రామం. దీనిని తొమ్మిది మూలల సరస్సు అని కూడా అంటారు. సంవత్సరం పొడవునా అద్భుతమైన వాతావరణం మరియు అనేక ఆకర్షణలతో అలంకరించబడిన ఈ సుందరమైన సరస్సు పర్యాటకులను ఎంతగానో మంత్రముగ్థులను చేస్తుంది. తొమ్మిది మూలల సరస్సును కలిగి ఉన్న లోయలోని హిల్ స్టేషన్ని సందర్శించొచ్చు. ఇక్కడ బోటింగ్తో పాటు రోయింగ్ వంటి సాహహ కార్యక్రమాలకు కూడా అందుబాటులో ఉన్నాయి.

తోష్
తోష్ అనేది ప్రజలకు వారాంతపు సెలవుల్లో గమ్యస్థానంగా మారిన ప్రదేశం. కసోల్ మరియు మణికరణ్ మార్గం నుండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ ప్రాంతం వస్తుంది. కానీ ఇక్కడకు వెళ్ళడానికి మీకు నేరుగా మార్గం కనిపించదు. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి ట్రెక్కింగ్ చేయవలిసి ఉంటుంది.

ధరమ్కోట్
ధరమ్కోట్ ఒక ఆఫ్బీట్ హిల్ స్టేషన్. ఇది చాలా మందికి తెలియదు కాబట్టి ఇక్కడ తక్కువ జనసమూహం కనిపిస్తుంది. ఈ ప్రదేశం ప్రశాంతమైన ప్రదేశం కోసం వెతుకుతున్న పర్యాటకులకు ఖచ్చితంగా ఉత్తమమైనది. ఈ ప్రాంతానికి మెక్లీడ్గంజ్ నుండి నడక మార్గం ద్వారా బయలుదేరొచ్చు. ఈ నిర్మలమైన, ప్రశాంతతకు మారుపేరైనా ఈ ప్రదేశాన్నిసందర్శించాలనుకుంటే మాత్రం మెక్లీడ్గంజ్ నుండి రిక్షా ద్వారా కూడా చేరుకోవచ్చు. ఈ ప్రాంతం చుట్టూ పచ్చని పొలాలు ఇక్కడికి వచ్చే చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి.



Click it and Unblock the Notifications












