నాశిక్ పర్యటనలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు
నాశిక్ గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక చిన్న నగరం. కుంభమేళా కేంద్రంగా ఉన్న ఒక ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రం. ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి మీరు సంవత్సరంలో ఏ సమయంలోనైనా ఈ నగరాన్ని సందర్శించవచ్చు.
వర్షాకాలంలో కూడా పర్యాటకులు సురక్షితంగా ట్రెక్కింగ్కు వెళ్లే కొన్ని నగరాల్లో ఇది ఒకటి. నాశిక్లో చూడదగ్గ ప్రదేశాలను తెలుసుకుందాం.

సప్తశృంగి
సప్తశృంగి ఒక హిందూ పుణ్యక్షేత్రం. దేశంలోని అత్యంత ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఒకటి. మహారాష్ట్రలోని నాశిక్ ప్రధాన నగరానికి 77 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో సప్తశృంగి నివాసి దేవత ఉంది. ఆమె ఏడు పర్వత శిఖరాలలో నివసించినట్లు చెబుతారు. ఆలయ ప్రాంగణానికి చేరుకోవడానికి 510 మెట్లు ఎక్కాలి. ప్రతి సంవత్సరం వందలాది మంది భక్తులు తమ పూజలను అందించడానికి ఆలయానికి తరలివస్తారు. ఈ ఆలయం భారతదేశంలోని 51 సతీ పీఠాలలో ఒక భాగం. అలాగే, మహారాష్ట్రలోని మూడింటిలో ఒకటి. నాశిక్ రైల్వే స్టేషన్ నుండి క్యాబ్ ద్వారా ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు.

త్రిరష్మి గుహలు
త్రిరష్మి గుహలు లేదా నాశిక్ గుహలు ప్రధాన నగరానికి 8.9 కిలోమీటర్ల దూరంలో ఉన్న 23 గుహల సమూహం. ఒకటవ శతాబ్దం నుండి మూడవ శతాబ్దం మధ్యలో ఈ గుహలు చెక్కబడ్డాయి. ఈ గుహలు పురాతన భారతీయ వాస్తుశిల్పంలో భాగమైన కొన్ని రాక్-కట్ బౌద్ధ శిల్పాలను ప్రదర్శిస్తాయి. నాశిక్లో సందర్శించవలసిన ప్రధాన ప్రదేశాలలో ఈ గుహలు కూడా ఉంటాయి. ప్రయివేటు రవాణాల ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. అదనంగా కర్లా గుహలు, భాజా గుహలు, పటాన్ గుహ మరియు బెడ్సే గుహలను కూడా సందర్శించే అవకాశం ఉంది. త్రిరష్మి గుహలను నాశిక్ రైల్వే స్టేషన్ లేదా నాసిక్ విమానాశ్రయం నుండి చేరుకోవచ్చు.

రాంకుండ్
నాశిక్లోని రాంకుండ్ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. నాశిక్లోని అగ్ర పర్యాటక కేంద్రంగా చెప్పొచ్చు. ఇక్కడి చెరువును హిందువులకు అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడుతోంది. ఎందుకంటే శ్రీరాముడు అజ్ఞాతవాసానికి బయలుదేరే ముందు ఇక్కడ స్నానం చేశాడని నమ్ముతారు. అత్యంత అద్భుతంగా, పవిత్రంగా భావించే ఈ ఆలయానికి, చెరువుకు నిత్యం సందర్శకులు పోటెత్తుతారు. దేశంలోని లక్షలాది మంది ప్రజలు పాల్గొనే కుంభమేళాకు కూడా ఇది కేంద్రంగా ఉంది. ఇక్కడి ఘాట్ల వద్ద విశ్రాంతి తీసుకునేందుకు అనువుగా ఉంటుంది. ఈ ప్రాంతం అక్షయ తృతీయ మరియు కుంభమేళా సమయంలో రద్దీగా ఉంటుంది. రాంకుండ్ నాశిక్ బస్ స్టాండ్ నుండి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.

అంజనేరి హిల్స్
నాశిక్-త్రయంబకేశ్వర్ పర్వత శ్రేణిలో ఉన్న కోటలలో అంజనేరి ఒకటి. అంజనేరి హిల్స్ నాసిక్ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 1,280 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కొండలు నాశిక్ సమీపంలోని సందర్శించదగిన ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటిగా చెప్పొచ్చు. వర్షాకాలంలో ట్రెక్కింగ్ యాత్రలో భాగంగా పర్యాటకులు అంజనేరి కొండలను సందర్శిస్తారు. ఈ ట్రెక్ వారిని పచ్చటి కొండల గుండా తీసుకెళ్తుంది. అంతేకాదు, దిగువ లోయల యొక్క అద్భుతమైన వీక్షణలను అందిస్తుంది.

దూద్సాగర్ జలపాతం / సోమేశ్వర్ జలపాతం
నాశిక్లోని ఉత్తమ పర్యాటక ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. జలపాతం అందంగా ఆకట్టుకోవడంతోపాటు చూపరులను మంత్రముగ్దులను చేస్తుంది. ప్రధాన నగరం నుండి కొద్ది దూరంలో ఉన్న ఈ జలపాతాన్ని సోమేశ్వర్ జలపాతం అని కూడా పిలుస్తారు. చెప్పుకోదగ్గ ఎత్తు లేనప్పటికీ, వర్షాకాలంలో జలపాతం దాని పూర్తి సామర్థ్యంతో ప్రవహించేటప్పుడు గొప్ప అనుభూతిని అందిస్తుంది. దూద్సాగర్ జలపాతం నాశిక్ బస్ స్టాండ్ నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది.



Click it and Unblock the Notifications












