Search
  • Follow NativePlanet
Share
» »శ్రావ‌ణ మాసంలో రామేశ్వరం జ్యోతిర్లింగ దర్శనం శుభప్రదం..!

శ్రావ‌ణ మాసంలో రామేశ్వరం జ్యోతిర్లింగ దర్శనం శుభప్రదం..!

శ్రావ‌ణ మాసంలో రామేశ్వరం జ్యోతిర్లింగ దర్శనం శుభప్రదం..!

శివునికి అంకితం చేయబడిన రామేశ్వరం హిందువులకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. రామేశ్వరం చార్ ధామ్‌లలో ఒకటి. శంకరుని ప‌న్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్ర‌సిద్ధి చెందింది. ఇది తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఉంది. హిందూ మహాసముద్రం బంగాళాఖాతం చుట్టూ ఉన్న అందమైన ద్వీపం. దీని ఆకారం అందమైన శంఖంలా కనిపిస్తుంది. రామేశ్వరుడు అంటే రాముడు అందుకే ఈ ప్రదేశానికి రామేశ్వరం అని పేరు వచ్చింది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని దర్శిస్తే అన్ని రోగాల నుండి విముక్తి లభిస్తుందని ఇక్క‌డికి వ‌చ్చే భ‌క్తులు నమ్ముతారు. ఈ ఆలయం గురించి వివరంగా తెలుసుకుందాం.

రామేశ్వర్ శివలింగాన్ని సీతా మాత స్వయంగా తన చేతులతో తయారు చేసింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ ఆలయానికి సీతామాత చేసిన రామేశ్వర శివలింగాన్ని దర్శించుకోవడానికి వస్తుంటారు. శ్రావ‌ణ మాసంలో అయితే ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య రెట్టింప‌వుతుంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన రామనాథస్వామి ఆలయం దశరథానంద భగవానుడు శ్రీరాముడికి అంకితం చేయబడింది. రామేశ్వరం జ్యోతిర్లింగంలో శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఉత్తరాఖండ్ నుంచి గంగాజలాన్ని ఇక్కడికి తీసుకువస్తారు. మరి ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.

1

ఆలయం 145 స్తంభాలపై ఉంది

రామేశ్వరం ఆలయానికి వెళ్లాలంటే 145 కాంక్రీట్ స్తంభాలపై నిర్మించిన వందేళ్ల‌ నాటి వంతెన దాటుకుని వెళ్లాలి. ఇక్కడ ఉన్న అగ్ని తీర్థంలో స్నానం చేస్తే సర్వపాపాలు హరిస్తాయని ఇక్క‌డికి వ‌చ్చే భ‌క్తులు విశ్వ‌సిస్తున్నారు. ఈ తీర్థం నుండి వచ్చే నీరు అద్భుత గుణాలతో నిండి ఉంటుందని, స్నానం చేయడం ద్వారా అన్ని దుఃఖాలు పోతాయ‌ని, వ్యాధులు కూడా దూరమవుతాయ‌ని న‌మ్ముతారు. ఈ ఆలయ ప్రాంగణంలో 22 కుండ్లు ఉన్నాయి. భక్తులు పూజించే ముందు స్నానాలు చేస్తారు.

2

రామేశ్వరం జ్యోతిర్లింగాన్ని ఎవరు స్థాపించారు?

రావణుడు బ్రాహ్మణ వంశానికి చెందినవాడు. అందుకే శ్రీరాముడు బ్రహ్మను చంపి పాపం చేశాడు. పాప పరిహారం కోసం ఋషులు రాముడికి శివలింగాన్ని స్థాపించి అభిషేకం చేయమని సలహా ఇచ్చారు. అందుకే శ్రీరాముడు దక్షిణ తీరంలో ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి అభిషేకం చేశాడ‌ని పురాణాలు చెబుతున్నాయి. మరొక నమ్మకం ఏమిటంటే, లంక నుండి తిరిగి వస్తున్నప్పుడు, శ్రీరాముడు దక్షిణ భారతదేశంలోని సముద్ర తీరంలో ఉన్నాడు. బ్రహ్మను చంపిన పాపాన్ని పోగొట్టుకోవ‌డానికి పర్వతం నుండి శివలింగాన్ని తీసుకురావాలని హనుమంతుడిని కోరాడు. హ‌నుమంతుడు రాక ఆల‌స్యం కావ‌డంతో, సీత మాత దక్షిణ ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని తయారు చేసింది. ఆ ప్రాంతాన్నే రామనాథ్ అని పిలుస్తారు. దానిని రాంలింగ్ అని కూడా పిలుస్తారు. ఇక‌, హనుమంతుడు తెచ్చిన శివలింగానికి వైశ్వలింగ్ అని పేరు పెట్టారు. అప్పటి నుండి ఈ రెండు శివలింగాలను పూజిస్తున్నారు. అందుకే రామేశ్వరాన్ని రామనాథస్వామి జ్యోతిర్లింగంగా కూడా పిలుస్తారు.

1

రామేశ్వరం ఎలా చేరుకోవాలి?

రామేశ్వరానికి సమీప విమానాశ్రయం మధురైలో ఉంది. ఇది నగరం నుండి సుమారు 149 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. అంతేకాకుండా, స‌మీపంలో టుటికోరిన్ విమానాశ్రయం కూడా 142 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానాశ్రయం వెలుపల నుండి బస్సులు, క్యాబ్‌లు, టాక్సీలలో రామేశ్వరం చేరుకోవచ్చు. రైలు మార్గం ద్వారా అయితే, మ‌ధురై నుండి రామేశ్వరానికి రైలులో కూడా వెళ్లొచ్చు. రోడ్డు మార్గం ద్వారా అయితే, మధురై, ఇతర నగరాల నుండి రామేశ్వరానికి AC మరియు నాన్ AC బస్సులు అందుబాటులో క‌ల‌వు.

More News

Read more about: rameswaram tamil nadu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+