Search
  • Follow NativePlanet
Share
» »శివుడి జ్యోతిర్లింగాలుగా పేరొందిన 12 శైవక్షేత్రాల్లో 11వ లింగం కేదార్‌నాథ్‌..!!

శివుడి జ్యోతిర్లింగాలుగా పేరొందిన 12 శైవక్షేత్రాల్లో 11వ లింగం కేదార్‌నాథ్‌..!!

కేదార్ నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది. హిందువులు పవిత్రంగా భావించే చార్‌ధామ్ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదరనాథ్, బద్రీనాథ్ భాగంగా ఉంటాయి. భక్తులు ముందుగా యమునోత్రితో చా

కేదార్ నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది. హిందువులు పవిత్రంగా భావించే చార్‌ధామ్ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదరనాథ్, బద్రీనాథ్ భాగంగా ఉంటాయి. భక్తులు ముందుగా యమునోత్రితో చార్‌ధామ్ యాత్రను ప్రారంభించి.. పైన పేర్కొన్న క్రమంలో బద్రీనా‌థ్‌తో ముగిస్తారు.

ఈ కేదార్ నాథ్ యాత్ర చాలా ఆనందం కలిగిస్తుంది. గంగోత్రి నుంచి భక్తులు శ్రీనగర్, రుద్రప్రయాగ, గౌరీకుండ్ మీదుగా మూడో క్షేత్రమైన కేదార్నాథ్ కు చేరుకుంటారు. ఇదొక జ్యోతిర్లింగ క్షేత్రం. సముద్రమట్టానికి 3584మీటర్ల ఎత్తులో హిమాలయాలలో ఉంటుంది. దీని గురించి స్కంద పురాణంలో చెప్పబడింది. మరి ఈ ఆలయం విశిష్టత ఏంటో తెలుసుకుందాం.

గంగోత్రి దర్శనం తర్వాత యాత్రికులు కేదార్ నాథ్ యాత్రకు

గంగోత్రి దర్శనం తర్వాత యాత్రికులు కేదార్ నాథ్ యాత్రకు

గంగోత్రి దర్శనం తర్వాత యాత్రికులు కేదార్ నాథ్ యాత్రకు పయనమవుతారు. గంగోత్రి నుండి ఉత్తర కాశీ మీదుగా వాహనాల్లో రుద్రప్రయాగ చేరుకోవచ్చు. కేదార్ నాథ్ వెళ్లే వార్గంలో మోటార్ వాహనాలు వెళ్ళగల చివరి ప్రదేశం గౌరీకుండ్. ఇక్కడి నుండి నడిచి లేదా గుర్రాల మీదగానీ కేదార్ నాథ్ కు చేరుకోవచ్చు. గౌరీ కుండ్ నుండి కేదార్ నాథ్ కు సుమారు 14 కి.మీ దూరం.

PC: Rupa Patil

దేశంలో జ్యోతిర్లింగాలుగా పేరుపొందిన 12వ శైవక్షేత్రాల్లో 11వ లింగం కేదార్ నాథ్.

దేశంలో జ్యోతిర్లింగాలుగా పేరుపొందిన 12వ శైవక్షేత్రాల్లో 11వ లింగం కేదార్ నాథ్.

దేశంలో జ్యోతిర్లింగాలుగా పేరుపొందిన 12వ శైవక్షేత్రాల్లో 11వ లింగం కేదార్ నాథ్. కేదార్ నాత్ ఆలయం మూడు పర్వతాల మధ్య ఉంటుంది. వాటిపైన గాంధీసరోవర్ అనే పెద్ద సరస్సు ఉంటుంది. అక్కడి నుండి కరిగే మంచు మూడు పాయలుగా చీలి కేదార్ నాథ్ ఆలయం చుట్టువైపుల నుంచి కిందకు సాగి మందాకినిగా రూపుదాల్చుకుంటాయి. అద్భుతమైన మందాకిని నది ఆలయానికి సమీపంలో ప్రవహిస్తుంది. ఈ శివాలయంలో ఎద్దు పృష్ఠభాగం రూపంలో ఉండే శివలింగం అత్యంత పవిత్రమైనది.

PC: Yogini

ఈ స్వామి వారు ఆరు నెలలు మానవుల పూజలను అందుకుంటే మిగిలిన 6నెలలు దేవతల పూజలు అందుకుంటారు

ఈ స్వామి వారు ఆరు నెలలు మానవుల పూజలను అందుకుంటే మిగిలిన 6నెలలు దేవతల పూజలు అందుకుంటారు

ఈ కేదారేశ్వర ఆలయం మేష సంక్రమణం రోజున అంటే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే రోజున తెరుస్తారు. ఇది వైశాఖమాంలో అనగా ఏప్రిల్లో నెల ఆఖరున లేదా మే మొదటి వారంలో వస్తుంది. తిరిగి వ్రుశ్చిక సంక్రమణం రోజున, అంటే సూర్యుడు వ్రుశ్చిక నక్షత్రంలో ప్రవేశించే రోజున మసి వేస్తారు. ఇది సాధారణంగా కార్తీక మాసంలో అంటే అక్టోబర్ నెల ఆఖరు వారంలో గాని, నవంవబర్ నెల మొదటి వారంలోగాని వస్తుంది. ఈ స్వామి వారు ఆరు నెలలు మానవుల పూజలను అందుకుంటే మిగిలిన 6నెలలు దేవతల పూజలు అందుకుంటారని చెబుతారు.

Photo Courtesy: Shaq774

పురాణాల ప్రకారం:

పురాణాల ప్రకారం:

ఇది హిమాలయ పర్వతములలో వెలసిన లింగం. నరనారయణులిద్దరూ కూడా సాక్షాత్తుగా ఈ భూమండలపై బదరీక్షేత్రమున తపస్సు చేసినప్పుడు ద్యోతకముయిన శివలింగము. కేదారము నందు ఉన్న శివలింగంను దర్శనం చేసినా, చేయడానికి వెడుతున్నప్పుడు మరణించినా మోక్షమే!

బదరీ క్షేత్రమునకు అవతలి వైపు హిమాలయాల్లో

బదరీ క్షేత్రమునకు అవతలి వైపు హిమాలయాల్లో

కేదారేశ్వరంలో నరనారాయణులు ఒక పార్థివ లింగను ఉంచి ఆరాధచేస్తుండేవారు. మట్టితో చేసి ఈ శివలింగంను వారు సాక్షాత్తు ఈశ్వరుడని అని నమ్మి శివలింగమునకు అర్చన చేస్తున్నారు, అప్పుడు ఆ శివలింగంలోంచి పరమశివుడు ఆవిర్భవించి మీరు చేసిన పూజకు నేను ఎంతో పొంగిపోయాను. ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత తపస్సులో పార్థివ లింగంకు ఇంత అర్చన చేశారు. మీకేమి కావాలో కోరుకోమని అడిగారు. అప్పుడు వారు స్వామీ ఇక్కడే ఈ బదరీ క్షేత్రమునకు అవతలి వైపు హిమాలయ పర్వతశ్రుంగముల మీద నీవు స్వయంభువ లింగమూర్తివై వెలసి లోకమును కాపాడు అని అడిగారు. వారి కోరిక ప్రకారం స్వామి అక్కడ వెలిశాడు.

Photo Courtesy: Paul Hamilton

అత్యుతన్నతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది మొట్టమొదటిది.

అత్యుతన్నతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది మొట్టమొదటిది.

అత్యుతన్నతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది మొట్టమొదటిది. అతి పురాతన శివలింగాలలో ఇది ఒకటిగా వెలుగొందుతున్నది. కేదార్ నాథ్ ఆలయం ఆది శంకరులచే 8వ శతాబ్దంలో పేనర్ నిర్మించబడిన శివాలయం. సుమారు 1000సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఈ ప్రస్తుత ఆలయాన్ని దీర్ఘచతురస్రాకార స్థావరం మీద పెద్ద రాతి కట్టడాలను ఉపయోగించి నిర్మించారు.

Photo Courtesy: Kmishra19

భక్తులు ఈ పుణ్య క్షేత్రానికి వెళ్ళే మెట్లపై పాళీ భాషలో రాసిన శాసనాలు

భక్తులు ఈ పుణ్య క్షేత్రానికి వెళ్ళే మెట్లపై పాళీ భాషలో రాసిన శాసనాలు

భక్తులు ఈ పుణ్య క్షేత్రానికి వెళ్ళే మెట్లపై పాళీ భాషలో రాసిన శాసనాలు ఎన్నో ఉన్నాయి. ఆలయంలోకి ప్రవేశించగానే ముందు భాగంలో ఒక చిన్న ముఖమంటపం ఉంది. ముఖ మంటపం దాటి లోపలకు వెళితే గర్భాలయం వస్తుంది. ఈ గర్భాలయం సుమారు 25 అడుగుల చదరంగా విశాలంగా ఉంది.ఎడమవైపు గోడలో బదరీనారాయణుని యొక్క మూర్తి ఉన్నది. స్థలపురాణం ప్రకారం ఈ కేదార్ నాథ్ ఉన్న ప్రదేశానికే కాక, బదరీ నాథ్ ఉన్న ప్రదేశానికి కూడా ఈ కేదార్ నాథుడే అధిపతి.

Photo Courtesy: Naresh Balakrishnan

 బదరీనాథుని మూర్తి

బదరీనాథుని మూర్తి

నరనారయణులు ఈ ప్రదేశానికి వచ్చి, ప్రస్తుతం బదరీనాథ్ ఉన్న ప్రాంతం తాము తపస్సు చేసుకోవడానికి అనుకూలంగా ఉందని భావించి, దానికి ఈ కేదార్ నాథుని అనుమతి పొంది తపస్సు ఆచరించారట. ఆ కారణం చేతనే ఈ ఆలయంలోపల బదరీనాథుని మూర్తి ఉన్నదని కొంత మంది అభిప్రాయం.

PC: Yogini

త్రిగుణాకారుడైన ఈ స్వామిని దర్శించినంతనే

త్రిగుణాకారుడైన ఈ స్వామిని దర్శించినంతనే

గర్భలయానికి మధ్యలో సుమారు 8 అడుగుల చదరంగా ఉన్న పానవట్టంలో కేదారేశ్వరుని లింగమూర్తి ఉన్నది. స్వామి త్రిగుణాకారంలో స్వయంభువుగా లింగరూపంలో కేదారేశ్వరుడిగా కొలువై పూజింపబడుతున్నారు. ఈ విగ్రహమూర్తి ఆకారం కొంచెం మార్పుగా ఉంటుంది. మామూలుగా మనం చూసే శివాలయాలలో లింగాకారంలా ఉండదు.3 అడుగుల ఎత్తు ఉండి, ఉపరితలం నున్నగా కాకుండా, గరుకుగా ఉంటుంది. ఆలయంలోనికి ప్రవేశించిన తర్వాత కుడిపక్కన గణేషుడు, ఎడమపక్క పార్వతీదేవి వెనుకవైపు శ్రీ కేదారేశ్వరస్వామి వారు ఉన్నారు. త్రిగుణాకారుడైన ఈ స్వామిని దర్శించినంతనే అన్ని కష్టాలు మరిచిపోతారు. ఈ యాత్ర వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.

PC: Yogini

ఈ ఆలయం వెనుకనే ఆదిశంకరాచార్యుల సమాధి మందిరం

ఈ ఆలయం వెనుకనే ఆదిశంకరాచార్యుల సమాధి మందిరం

ఈ ఆలయం వెనుకనే ఆదిశంకరాచార్యుల సమాధి మందిరం ఉంటుంది. శంకరాచార్య ప్రముఖ హిందూ మత మహర్షి అద్వైత వేదాంత యొక్క అవగాహన వ్యాప్తి కొరకు కృషి చేసారు. అయన చార్ ధామ్‌ కనుగొన్నతరువాత ఈ నిర్దిష్ట ప్రదేశంలో 32 ఏళ్ల వయస్సులో సమాధి అయ్యారు.

PC: Rupa Patil

పూజలు:

పూజలు:

కేదారేశ్వరస్వామి రెండు సార్లు రెండు విధాలుగా పూజింపబడుతాడు. ఉదయం బాలభోగ్ అష్టోత్తరం, మహాభిషేకం మొదలైన పూజలు ఎన్నో చేస్తారు. ఇలా ఉదయం పూట జరిగే పూజలను నిర్వాణపూజ అంటారు.

కేదార్ నాథ్ ఆలయం మధ్యాహ్నం ఒంటిగంటకు మూసివేసి తిరిగి సాయంత్రం నాలుగు అయిదు గంటల మధ్య తెరుస్తారు.సాయంత్రం జరిగే పూజను శ్రుంగార పూజ అంటారు. సాయంకాలం నుండి రాత్రి వరకు స్వామి వారిని అందమైన పూలతో అలంకరిస్తారు. కేదార్ నాథ్ లో 4 లేక 5 గంటలకే చీకటి పడుతుంది. చీకటి పడిన తర్వాత ఆలయం ప్రాంగణం అత్యద్భుతంగా ఉంటుంది. కేదారేశ్వరస్వామి వారికి 6గంట నుండి 7గంటల వరకు విశేష హారతిని ఇస్తారు. ఆలయం లోపల హారతిని ఇస్తుంటే, ఆలయం వెలుపల సాధువులు శంఖం పూరిస్తుంటారు. రాత్రి సమయంన స్వామివారికి అర్చనలు ఉండవు. అలంకార మూర్తుడైన స్వామి దర్శనం మాత్రమే లభిస్తుంది.

ఎలా వెళ్ళాలి??

ఎలా వెళ్ళాలి??

వాయుమార్గం
కేదార్ నాథ్ కు సమీప ఎయిర్ పోర్టు సుమారు 183 కి. మీ. ల దూరం లోని డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయం. ఈ ఎయిర్ పోర్టు నుండి రుద్రప్రయగ్ కు టాక్సీ లు లభిస్తాయి.

రైలు మార్గం
కేదార్ నాథ్ కు ఋషి కేష్ రైలు స్టేషన్ సమీపం. ఇక్కడకు కొన్ని రైళ్లు మాత్రమే వస్తాయి. అయితే 24 కి.మీ. ల దూరం లో కల హరిద్వార్ రైలు జంక్షన్ నుండి దేశం లోని వివిధ ప్రాంతాలకు రైళ్ళు కలవు.

రోడ్డు మార్గం
కేదార్ నాథ్ కు నేషనల్ హై వే 58 మార్గం లో అంటే ఢిల్లీ నుండి బద్రీనాథ్ మార్గంలో కలదు. కనుక బస్సు సేవలు బాగా వుంటాయి. వేసవిలో న్యూఢిల్లీ నుండి బద్రీనాథ్ వెళ్ళే బస్సు లు రుద్రప్రయాగ్ మీదుగానే వెళతాయి.

Photo Courtesy: anurupa_chowdhury

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X