ఎపుడైనా ఒక్కసారి మన పూర్వీకుల జీవన విధానం ఎలా వుండేది అనేది గమనించారా ? అలాగానుకుంటే, ఒక్కసారి మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని చట్టర్పూర్ జిల్లాలో కల ఖజురాహో పట్టణానికి వెళ్ళండి.
యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశ గుర్తింపు పొందిన ఈ ప్రదేశంలో అనేక పురాతన హిందూ మరియు జైన టెంపుల్స్ కలవు. ప్రారంభంలో ఈ గుడులు మొత్తంగా 85 ఉండేవి. కాని నేడు అవి 22 గా మాత్రమే మిగిలాయి.
అందమైన ఈ దేవాలయాలు మన పూర్వీకుల సాంప్రదాయాలు, సంస్కృతి, నమ్మకాలు తెలియ చేస్తాయి. ఈ టెంపుల్స్ చాలావరకు మన దేవి దేవుళ్ళను పూజించేందుకు నిర్మించారు. కనుక ఒక్కసారి ఈ దేవాలయాల సందర్శన చేసి చరిత్రలోకి తొంగి చూడండి.

మరువలేని శిల్పాలు ...మమతల నిలయాలు!
ఖజురాహో ఎలా చేరాలి ?
ఖజురాహో పట్టణం చేరటం తేలిక. ఖజురహో ఎయిర్ పోర్ట్ దేశం లోని అన్ని ప్రధాన నగరాలకు అంటే, ఢిల్లీ, వారణాసి, ఆగ్రా, ముంబై నగరాలకు విమాన సేవలు కలిగి వుంది. 2008 సంవత్సరంలో ఇక్కడ తెరచిన రైలు స్టేషన్ ఝాన్సి రైలు స్టేషన్ కి అనుసంధానమై వున్నది. ఇక్కడకు రైలు లో కూడా ప్రధాన నగరాలనుండి చేరవచ్చు. లేదా సమీప పట్టణాలలో వుండేవారు బస్సు లు, ఇతర వాహనాలలో కూడా చేరవచ్చు.
Photo Courtesy: Sfu

మరువలేని శిల్పాలు ...మమతల నిలయాలు!
ఆదినాధ్ జైన్ టెంపుల్
ఆదినాధ్ జైన్ టెంపుల్ చాలా అందంగా అనేక శిల్పాలతో నిర్మించబడింది. ఇది జైన తీర్ధంకరులకు అన్కితమివ్వబడినది.
ఖజురాహో లో వసతి ఎక్కడ పొందాలి అనే దానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Photo Courtesy: Antoine Taveneaux

మరువలేని శిల్పాలు ...మమతల నిలయాలు!
చతుర్భుజ దేవాలయం
ఖజురాహో లో కల చతుర్భుజ టెంపుల్ దాని శిల్ప కళకు ప్రసిద్ధమైనది. మరియు ఈ టెంపుల్ మాత్రమే ఎట్టి కామ సౌందర్య శిల్పాలు కలిగి ఉండలేదు. ఈ దేవాలయంలో 9 అడుగుల ఎత్తైన చక్కగా చెక్కిన విష్ణుమూర్తి విగ్రహం కలదు.
Photo Courtesy: Rishav Guha

మరువలేని శిల్పాలు ...మమతల నిలయాలు!
చిత్రగుప్త టెంపుల్
ఇక్కడ కల చిత్రగుప్త టెంపుల్ సూర్య భగవానుడికి అంకితం ఇవ్వబడినది. ఈ టెంపుల్ ను తూర్పు ముఖంగా నిర్మించారు.
Photo Courtesy: Rajenver

మరువలేని శిల్పాలు ...మమతల నిలయాలు!
దేవి జగదంబ టెంపుల్
దేవి జగదంబ టెంపుల్ విశ్వానికి అధిపతి అయిన జగదంబ మాత ప్రధాన విగ్రహంతో వుంటుంది. మిగిలిన టెంపుల్స్ తో పోలిస్తే, ఇది చిన్నది. అతి సుందరమైన శిల్పాలకు ఈ టెంపుల్ నిలయంగా వుంది.
Photo Courtesy: Arian Zwegers

మరువలేని శిల్పాలు ...మమతల నిలయాలు!
దుల్హాదేవ్ టెంపుల్
దుల్హా దేవ్ టెంపుల్ లో ఒక శివ లింగం కలదు. ఈ టెంపుల్ లో ఇంకనూ అనేక దేవతల, అప్సర, రంభ వంటి నాట్య కారిణుల శిల్పాలు కూడా చూడవచ్చు.
Photo Courtesy: Asitjain

మరువలేని శిల్పాలు ...మమతల నిలయాలు!
కందారియ మహాదేవ టెంపుల్
కందారియ మహాదేవ టెంపుల్ అనేక శిల్పాలతో వుంటుంది. భారతీయ శిల్ప కళలలో ఇది ఒక అద్భుతంగా గోచరిస్తుంది.
Photo Courtesy: dalbera

మరువలేని శిల్పాలు ...మమతల నిలయాలు!
లక్ష్మణ టెంపుల్
లక్ష్మణ టెంపుల్ ఈ ప్రాంతంలో అతి పురాతన దేవాలయం. దీనిని నిర్మించిన ఒక రాజు పేరుపై దేవాలయానికి ఈ పేరు వచ్చింది. ఈ టెంపుల్ ప్రవేశంలో కల ఒక భూ సమానంతర దూలం పై బ్రహ్మ, విష్ణు, శివ విగ్రహాలను చూస్తారు.
Photo Courtesy: Aakash.gautam

మరువలేని శిల్పాలు ...మమతల నిలయాలు!
పార్స్వనాద టెంపుల్
ఇక్కడ కల దేవాలయాలన్నిటి లోకి పార్శ్వనాథ టెంపుల్ చాలా పెద్దది. ఈ టెంపుల్ కు మూడు మిద్దెలు కలవు. ఈ మూడు మిద్దెల నిర్మాణాలు, హిందూ, బౌద్ధ మరియు ముస్లిం శిల్ప ప్రభావం కలిగి వుంటాయి.
Photo Courtesy: Marcin Białek

మరువలేని శిల్పాలు ...మమతల నిలయాలు!
వామన టెంపుల్
వామన టెంపుల్ లో ప్రధాన దైవం విష్ణుమూర్తి. వామనుడంటే విష్ణు మూర్తి అవతారం. నిరాడంబరమైన శిల్ప శైలి తో కూడిన ఈ దేవాలయం కొద్దిపాటి దూరంగా వేరు ప్రదేశంలో వుంటుంది.
Photo Courtesy: Sfu

మరువలేని శిల్పాలు ...మమతల నిలయాలు!
వరాహ టెంపుల్
వరాహ టెంపుల్ లో కూడా విష్ణు మూర్తి విగ్రహమే వుంటుంది. వరాహ అంటే విష్ణుమూర్తి అవతారం. దేవాలయ మధ్య భాగంలో వరాహ విగ్రహం ఒక శేష నాగు తో కూడి వుంటుంది.
Photo Courtesy: Rajenver

మరువలేని శిల్పాలు ...మమతల నిలయాలు!
విశ్వనాథ్ టెంపుల్
విశ్వనాథ టెంపుల్ లో శివ భగవానుడి లేదా మహాదేవుడి విగ్రహం వుంటుంది. ఈ టెంపుల్ లో మరొక చిన్న టెంపుల్ నంది లేదా శివుడి వాహనం అయిన ఎద్దుకు నిర్మించారు.
ఖజురాహో ఇతర ఆకర్షణలకు ఇక్కడ చూడండి.
Photo Courtesy: Airunp



Click it and Unblock the Notifications
















