బంగాళాఖాతం తీరంలో ఉన్న ఒడిషా - కోణార్క్ చాలా అందమైన పర్యాటక ప్రదేశం. ఇది సూర్య దేవాలయానికి ప్రసిద్ది చెందింది. 18వ శతాబ్దంలో, అప్పటి రాజు నరసింహ దేవ్ I ఈ ఆలయాన్ని సూర్య భగవానుడికి అంకితం చేశారు. ఈ అద్భుతమైన నిర్మాణాన్ని చూసేందుకు పర్యాటకులు ఇప్పటికీ ఇక్కడికి తరలివస్తున్నారు. విదేశీయులు ఇక్కడ బారులు తీరుతున్నారు. దీని ప్రధాన ఆలయం ఎత్తు సుమారు 227 అడుగులు ఉంటుంది. ఇది భారతదేశంలోని అన్ని దేవాలయాలలో కన్నా ఎత్తైనది. ఇది 7 గుర్రాలు, 24 చక్రాలు కలిగిన సూర్యదేవుని యుద్ధభూమి రూపంలో నిర్మించబడింది. ఈ ఆలయ నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. UNESCO దీనిని 1984లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. కుటుంబంతో కలిసి ఈ శీతాకాలంలో సందర్శించేందుకు ఈ ప్రదేశం ఎంతో అనువైనది.

ఆస్ట్రాంగ్ బీచ్
కోణార్క్ నుండి సుమారు 19 కిలోమీటర్ల దూరంలో ఆస్ట్రాంగ్ బీచ్ ఉంది. ఈ బీచ్ సూర్యాస్తమయ వీక్షణకు ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి బీచ్లో ప్రత్యేకత కలిగించే రెండవ అంశం చేపల మార్కెట్. ఇక్కడ కేవలం చేపలను కొనడమే కాకుండా, చేపలు పట్టడం, వంట చేయడం, వివిధ రకాల చేపలను రుచులను కూడా ఆస్వాదించొచ్చచు ఆనందించవచ్చు.

సూర్య దేవాలయం
కోణార్క్లోని సూర్య దేవాలయం అతిపెద్ద ఆకర్షణగా నిలిచింది. ఈ రాతి ఆలయంలో మూడు రకాల రాళ్లను ఉపయోగించారు. అవి దాని సరిహద్దు గోడలు, నేల, మెట్లపై లేటరైట్ రాయి, తలుపు ఫ్రేమ్లలో క్లోరైట్ రాయి, మిగిలిన భవనంలో ఖోండలైట్ రాయిని ఉపయోగించారు. రాళ్ల నలుపు రంగు కారణంగా యూరోపియన్ నావికులు దీనికి బ్లాక్ పగోడా అనే పేరును కూడా పెట్టారు. ఇక్కడ ప్రతి ఏటా కోణార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ నిర్వహించబడుతుంది. ఈ ఫెస్టివల్లో ఒడిస్సీ, కథక్, భరతనాట్యం, కూచిపూడి, మణిపురి మొదలైన అనేక శాస్త్రీయ నృత్యాలు ప్రదర్శించబడతాయి.

చంద్రభాగ బీచ్
చంద్రభాగ బీచ్ సూర్య దేవాలయం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది సమీపంలో సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ సూర్యోదయ దృశ్యాలను వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తుంటారు. శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు కుష్టు వ్యాధి నుండి ఉపశమనం పొందేందుకు ఇక్కడ సూర్యుడిని పూజించాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి ఏటా ఇక్కడ డిసెంబరు-జనవరి నెలల్లో ఇసుక కళా ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు విదేశాల నుండి కూడా పర్యాటకులు వస్తుంటారు. అంతేకాకుండా ఈ బీచ్కు ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఈ బీచ్ భారతదేశపు మొట్టమొదటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను పొందిన ఘనతను కూడా కలిగి ఉంది.
కోణార్క్ మ్యూజియం
ఇక్కడ కోణార్క్ మ్యూజియం కూడా ఎంతగానో ప్రసిద్ధిచెందింది. ఇతర నాగరికతలకు సంబంధించిన అనేక విగ్రహాలు, అవశేషాలను ఈ మ్యూజియంలో చూడొచ్చు. వీటిని వీక్షించడంతో పాటు వాటి గురించిన సమాచారాన్ని కూడా పొందొచ్చు. కోణార్క్ సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చి వరకు. ఎందుకంటే సంవత్సరంలో మిగిలిన నెలల్లో ఈ ప్రదేశం ఎంతో వేడిగా ఉంటుంది.
ఎలా వెళ్ళాలి?
పూరి, భువనేశ్వర్ రెండింటి నుండి రోడ్డు మార్గం ద్వారా ఈ ప్రదేశాన్ని చేరుకోవచ్చు. దేశంలోని పెద్ద నగరాల నుండి పూరీ మరియు భువనేశ్వర్ రెండింటికి రైలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. విమాన మార్గం ద్వారా ఈ ప్రాంతాన్ని చేరుకోవాలనుకుంటే మాత్రం భువనేశ్వర్ సమీపంలోని విమానాశ్రయం.



Click it and Unblock the Notifications













