అది మహారాజుల తోట ... సాయంత్రం అయ్యిందంటే అక్కడ రాజ కుటుంబాలు వాలిపోతుంటారు. రాజ కుటుంబీకుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన తోట నేడు దేశ, విదేశ పర్యాటకులకు ఒక గమ్యస్థానం. ఏటా ఆ తోటలను సందర్శించటానికి పాతిక లక్షలు పైగా వస్తుంటారని అంచనా. మైసూర్ దగ్గరలో ఉన్న ఆ ఉద్యానవనమే ... బృందావన్ లేదా బృందావనం !!
వీకెండ్లో మైసూర్ ట్రిప్ !
బృందావనం లేదా బృందావన్ గార్డెన్స్ కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ నగరానికి చేరువలో ప్రవహిస్తున్న కావేరి నది పై నిర్మించిన కృష్ణరాజసాగర డ్యాం ను అనుకోని ఉన్నది. ఈ ఉద్యానవనం మైసూర్ నుండి 22 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరు నుండి 144 కిలోమీటర్ల దూరంలో కలదు. మైసూర్ వచ్చే ప్రతి పర్యాటకుడు బృందావనం గార్డెన్ చూడనిదే పర్యటన పూర్తికాదు. దీని గురించి మరిన్ని వివరాలు క్లుప్తంగా ... !
మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

బస్ స్టాప్
మైసూర్ ప్యాలెస్ బస్ స్టాప్ నుంచి బృందావన్ గార్డెన్స్ కు అనేక ప్రవేట్, సిటీ బస్సులు తిరుగుతాయి. మైసూర్ ప్యాలెస్ నుండి అరగంట ప్రయాణంలో ఈ బృందావన్ ఉద్యానవనం చేరుకోవచ్చు.
చిత్రకృప : Sugnyan

కృష్ణరాజసాగర డ్యామ్
బృందావన్ గార్డెన్స్ కు నీటి కొదువలేదు. పక్కనే డ్యాం ఉండటంచేత నీరు నిరంతరం అందుబాటులో ఉంటుంది. అందమైన మొక్కలు, పచ్చిక బయళ్ళు, ఫౌంటైన్ లు కలవు.
చిత్రకృప : PP Yoonus

ఉద్యానవనం
ఉద్యానవనం మొత్తం చూసిరావటానికి రెండు - మూడు గంటల సమయం పడుతుంది. ఇది సుమారు 60 ఎకరాలకు పైగా విస్తరించింది.
చిత్రకృప : Joe Ravi

వెలుతురు
ఉదయం వేళ కంటే సాయంత్రం వేళ గార్డెన్ సందర్శన ఉత్తమం. సాయంత్రం తోటలను అందమైన రంగురంగుల విదుద్దీపాలతో అలంకరిస్తారు. ఆహ్లాదకరమైన సంధ్యాసమయాన్ని ఆస్వాదించవచ్చు. బృందావనం లో లైట్లు ప్రతిరోజూ సాయంత్రం 7 నుండి రాత్రి 8 గంటల వరకు వెలుగుతాయి.
చిత్రకృప : Rishabh Mathur

లైట్ కాంతులు
చిన్న,పెద్ద ఫౌంటైన్ ల నీటి పొంగులు మరియు లైట్ లతో అలంకరించబడిన వివిధ ఉద్యానవనాలు మొదలైన ప్రత్యేకతలు ఎన్నో పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తాయి.
చిత్రకృప : Rohin

ఉద్యానవనం
దీనిని ఒకప్పుడు కృష్ణరాజ టెర్రస్ గార్డెన్స్ అని పిలిచేవారు. 1927 వ సంవత్సరంలో ఈ ఉద్యానవనం పనులు ప్రారంభించి 1932 వ సంవత్సరంలో పూర్తి చేశారు. కె. ఆర్. ఎస్. డ్యాం ను భారతరత్న విశ్వేశ్వరయ్య నిర్మిస్తే, ఉద్యానవనమును సర్ మీర్జా ఇస్మాయిల్ కట్టించెను.
చిత్రకృప : Ashwin Kumar

సరస్సు
గార్డెన్ లో బొటానికల్ గార్డెన్స్, వాటర్ ఫౌంటైన్స్ మరియు సరస్సులు కలిగి ఉన్నది. సరస్సులలో బోట్ రైడ్ ను ఎంజాయ్ చేయవచ్చు.
చిత్రకృప : MikeLynch

చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు
బృందావన్ గార్డెన్స్ కు పక్కనే 2 హార్టికల్చర్ పొలాలు, 75 ఎకరాలలో పండ్ల తోటలు ఉన్నాయి. ఇవేకాక నగవన 30 ఎకరాలలో, చంద్రవన 5 ఎకరాలలో విస్తరించి ఉన్నాయి.
చిత్రకృప : Sumanth Vepa

టైమింగ్స్
బృందావన్ గార్డెన్స్ ను సంవత్సరంలో ఎప్పుడైనా సందర్శించవచ్చు. ప్రతిరోజూ బృందావన్ గార్డెన్స్ తెరిచే ఉంటుంది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పర్యాటకులను అనుమతిస్తారు. శని, ఆది వారాలలో ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు అనుమతిస్తారు.
చిత్రకృప : Ishan Manjrekar

ప్రవేశ రుసుము
బృందావన్ గార్డెన్స్ లోనికి వెళ్ళటానికి టికెట్ తీసుకోవాలి. పిల్లలకు (5 నుండి 10 సంవత్సరాలు) - రూ. 5/-, పెద్దలకు - రూ. 15/- ప్రవేశ రుసుము ఉంటుంది. గార్డెన్స్ లో అనుమతి లేనిదే కెమెరా వాడరాదు. పెనాల్టీ 50 రూపాయలు.
చిత్రకృప : Abgpt

వారాంతంలో
శని, ఆది వారాలలో మరియు సెలవు దినాలలో బృందావన్ గార్డెన్స్ కు వచ్చేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఆ సమయంలో విద్యుద్దీపకాంతులు మరింతగా జిగేల్ మంటూ ప్రకాశిస్తాయి.
చిత్రకృప : Rishabh Mathur

ఫౌంటైన్ షో
ఫౌంటైన్ షో ప్రతి రోజూ సాయంత్రం 6: 30 నుండి 7: 30 వరకు (సోమవారం - శుక్రవారం), 6: 30 నుండి 8: 30 వరకు (శని, ఆదివారాలలో, సెలవు దినాలలో) ప్రదర్శిస్తారు.
చిత్రకృప : Rishabh Mathur

రద్దీ
కనుక, పర్యాటకులకు చెప్పొచ్చేదేమిటంటే సాయంత్రం 4: 00 - 4 : 30 అయ్యేసరికి బృందావన్ గార్డెన్స్ చేరుకొని 6 : 00 - 6 : 30 వరకు సౌత్ గార్డెన్స్ చూసేయండి. 6: 30 కల్లా నార్త్ గార్డెన్స్ కు వచ్చేసి ఫౌంటైన్ షోను 7 : 30 వరకు తిలకించి తిరుగుప్రయాణమవ్వండి. ఈ విధంగా టైమింగ్ పాటిస్తే రద్దీ నుండి బయటపడవచ్చు.
చిత్రకృప : Rishabh Mathur

బృందావన్ గార్డెన్ లో ఏ ఏ ప్రదేశాలను చూడవచ్చు ?
నార్త్ బృందావన్, సౌత్ బృందావన్ గార్డెన్స్, ఆర్చ్ ఫౌంటైన్స్, క్రాస్ - ఫౌంటైన్స్, ఎండ్ ఫౌంటైన్స్, క్రాస్ ఛానల్ ఫౌంటైన్స్, రాధాకృష్ణ ఫాల్స్, గొడుగు ఫౌంటైన్, చిల్డ్రన్స్ పార్క్, పిరమిడ్ ఫౌంటైన్, బాస్కెట్ ఫౌంటైన్, కావేరమ్మ విగ్రహం వద్ద ఉన్న ఫౌంటైన్, కావేరమ్మ దేవత విగ్రహం.
చిత్రకృప : YVSREDDY

వసతి
బృందావన్ గార్డెన్స్ లో వసతికై బెంగ పడాల్సిన అవసరం లేదు. మైసూర్ - బృందావన్ గార్డెన్స్ వెళ్ళే దారిలో అనేక లాడ్జీలు ఉన్నాయి. మైసూర్ లో కూడా వసతి పొందవచ్చు. మైసూర్ హోటళ్ళ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
చిత్రకృప : Ravi Sarma

బృందావన్ గార్డెన్స్ చేరుకోవడం ఎలా ?
మైసూర్ నగరం రవాణా పరంగా అన్ని విధాలా అనుకూలం. ఇక్కడ విమానాశ్రయం, రైల్వే స్టేషన్ కలదు. దేశం నలుమూలల నుండి ఇక్కడికి తరచూ విమానాలు, రైళ్ళు వస్తుంటాయి. మైసూర్ నుండి కే. ఆర్. ఎస్ డ్యాం వరకు అనేక ప్రభుత్వ మరియు ప్రవేట్ బస్సులు ఎల్లప్పుడూ తిరుగుతుంటాయి. బెంగళూరు నుండి డ్యాం వరకు, మైసూర్ వరకు కూడా కె. ఎస్. ఆర్. టి. సి బస్సులు నడుస్తుంటాయి.
చిత్రకృప : RanjithSiji



Click it and Unblock the Notifications












