అది వేయి సంవత్సరాల నాటి గుడి. అంతే కాదు భారత దేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న గుడి. అదే తంజావూరులోని బృహదీశ్వరాలయం. అక్కడ కనిపించే ప్రతి అంశం ఓ మిస్టరీతో పాటు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎక్కడా సిమెంట్ అన్నమాటకు తావు లేకుండా ఉక్కు అన్నపదం లేకుండా కట్టిన ఈ గుడిని చూస్తే ఆనాటి టెక్నాలజీ ఇంత అద్భుతంగా ఉందా అనిపిస్తుంది. ఆశ్చర్యంతో పాటు ఆసక్తి రేపుతున్న ఆ గుడి గురించిన కొన్ని మిస్టరీ వింతలు.
తంజావూరు ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే !
తంజావూరు మ్యాప్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
టాప్ ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి:
13 అంతస్థులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం
వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే దాదాపు వేయి సంవత్సరాల క్రితం కట్టిన గుడి. 13 అంతస్థులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం. భారతదేశంలో అతి పెద్ద శివలింగం ఉన్న క్షేత్రం.దక్షిణ కాశీగా పేరొందిన ఈ గుడిలో ఎన్నో మిస్టరీ వింతలు దాగి ఉన్నాయి. దాదాపు ఈ శివలింగం 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది.
మంత్రముగ్ధుల్ని చేసే తమిళనాడు ప్యాలెస్ లు !
అతి పెద్ద నంది విగ్రహం
అతి పెద్ద నంది విగ్రహాన్ని శివునికి తోడుగా నందీశ్వరుడు కూడా అంతే ఎత్తులో ఉండాలనుకున్నారో ఏమో కాని అతి పెద్ద నంది విగ్రహాన్ని అక్కడ నిర్మించారు. ఈ విగ్రహం దాదాపు 20 టన్నులు కలిగి ఉంటుంది. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే ఇది ఏకశిలా విగ్రహం. 2 మీటర్ల ఎత్తు ,2.6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది.
గంగైకొండ చోళపురం బృహదీశ్వరాలయం !
ఉక్కు గాని సిమెంట్
ఉక్కు గాని సిమెంట్ కాని ఈ ఆలయానికి ఎటువంటి ఉక్కు గాని సిమెంట్ కాని వాడలేదు. పూర్తిగా గ్రానైట్ రాయితో కట్టబడింది. 13 అంతస్థులు గ్రానెట్ రాయితోనే కట్టారు.
తంజావూర్ ... మిస్టరీల ఆలయం!!
13 అంతస్థుల పైన ఎటువంటి వాలు
13 అంతస్థుల పైన ఎటువంటి వాలు లేకుండా 80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం ఈ గుడికే హైలెట్. 13 అంతస్థుల పైన ఎటువంటి వాలు లేకుండా నిలబడటమనేది ఇప్పటికీ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
మిట్ట మధ్యాహ్న సమయంలో
ఇక మిట్ట మధ్యాహ్న సమయంలో ఆ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడినా గోపురం నీడ మాత్రం చూడలేము. 80 టన్నుల బరువున్న ఆ కలశాన్ని అక్కడికీ తీసుకెళ్లటమనేది ఆనాటి రాజుల నైపుణ్యానికి ప్రతీక.
మనం మాట్లాడుకునే శబ్దాలు
మనం మాట్లాడుకునే శబ్దాలు మళ్లీ ప్రతిధ్వనించవు ఈ ఆలయ ప్రాంగణం దాదాపు పర్లాంగు దూరం ఉంటుంది.అంటే చాలా సువిశాలంగా ఉంటుంది. మనం మాట్లాడుకునే శబ్దాలు మళ్లీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఙానంతో ఈ గుడిని కట్టారు.
ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలు
ఇక ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలున్నాయి. ఇవి కొన్ని తంజావూరులో ఉన్న కొన్ని ఆలయాలకు దారితీస్తే కొన్ని మాత్రం మరణానికి దారి తీసే గోతులు కలిగి ఉన్నాయని అన్ని దారులు మూసేశారు.
రాజరాజచోళుడు
ఆలయాన్ని నిర్మించిన రాజరాజచోళుడు తగు జాగ్రత్తల కోసం అయితే ఈ దారులు ఆలయాన్ని నిర్మించిన రాజరాజచోళుడు తగు జాగ్రత్తల కోసం తయారుచేసుకున్నారని కొంతమంది వాదిస్తుంటారు.
తంజావూర్ ... మిస్టరీల ఆలయం!!
ఆరు మి. మి కన్నా తక్కువ సైజులో వంపుతో కూడిన రంధ్రాలు
ఆరు మి. మి కన్నా తక్కువ సైజులో వంపుతో కూడిన రంధ్రాలు అయితే ఇప్పటికీ టెక్నాలజీకి అంతుపట్టని విషయం ఏంటంటే. ఈ గుడికి చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మి. మి కన్నా తక్కువ సైజులో వంపుతో కూడిన రంధ్రాలు కనిపించడం. అవి అలా ఎందుకు పెట్టారు ఇప్పటికీ మిస్టరీనే.
నిత్య నూతన ఆలయం
వెయ్యేళ్లు దాటినా నిత్య నూతనం ఈ ఆలయం ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. వేయి సంవత్సరాల గుడులు దాదాపు పాడుబడిన స్థితిలో ఉంటాయి. అయితే ఈ గుడి మాత్రం అత్యధ్భుతంగా కొత్తగా నిర్మించినట్లు ఇప్పటికీ కనిపిస్తుంది.
తంజావూరు వాతావరణం
ఈ నగరం ఎలా అంతరించిందో
రాజేంద్రచోళుని అంతఃపురం ఈ అలయానికి ఒక కిలోమీటరు దూరంలోనే వున్నది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడ అంతు పట్టదు.
సమీప ప్రదేశాలు తంజావూరు (వారాంతపు విహారాలు )
ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు
ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటు తున్నాయి.
ఎలా చేరాలి?
- భద్రాచలం గుడికి సంభందించిన 10 నమ్మలేని నిజాలు !
- ఇప్పటికీ మగవారు ఆ గుడిలోకి అడుగుపెట్టరు!
- కలియుగ అంతానికి కారణమయ్యే గుడి !