Ayodhya Sarayu river : భారతదేశంలో నదుల చరిత్ర చాలా పురాతనమైనది. ఆ నదులతోనే నాగరికత, గ్రామాలు ఏర్పడడం జరిగింది. నదులు మన సానుకూలతను పెంచడమే కాకుండా, జీవనాధారంగా కూడా పరిగణించబడతాయి. గంగా, యమునా, సరస్వతి, నర్మదా వంటి అనేక నదుల గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ సరయూ నది గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ప్రస్తుత పరిస్థితుల్లో అయోధ్య రామమందిరం సందర్భంగా సరయూ నది ఎంతో చర్చనీయాంశమైంది. ఈ సరయూ నది గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఈ నది ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉంది. ఈ నదికి హిందూ పురాణాలలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది హిందూమతంలో అత్యంత గౌరవనీయమైన దేవతలలో ఒకరైన శ్రీరాముడిచే ఆశీర్వదించబడిన నది అని అందరి నమ్మకం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది సరయూ నది పవిత్ర జలాల్లో స్నానాలు చేసేందుకు వస్తుంటారు. సరయూ నది చరిత్ర, దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.

సరయూ నది శారదా నదికి ఉపనదిగా పరిగణించబడుతుంది. దీనినే సర్జు అని కూడా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్ జనాభాకు ఈ నది ప్రధాన నీటి వనరుగా ఉంది. ఈ నది హిమాలయాల పాదాల నుండి ఉద్భవించి శారదా నదికి ఉపనదిగా మారుతుంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లోని అనేక పర్యాటక ప్రదేశాల గుండా ఈ నది సుమారు 350 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. సరయూ నది గురించి రామాయణం, వేదాలు వంటి హిందూ గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది. పవిత్ర జలాల్లో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. ఈ నదికి అపారమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని, ఇందులో స్నానం చేయడం వల్ల దైవంతో అనుసంధానించబడి అంతర్గత శాంతిని పొందవచ్చని ఇక్కడివారి విశ్వాసం.
ఈ నది ఔషధ గుణాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఎన్నో రోగాలను కూడా ఈ నది దూరం చేస్తుందని భక్తుల నమ్మకం. సరయూ నదిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం, సరయు నది ఒడ్డున శ్రవణ్ కుమార్ చేత దశరథ రాజు చంపబడ్డాడని చెబుతుంటారు. భూమి కింద ప్రవహించే ఏకైక నది సరయూ నది అని కూడా అంటారు. హిందూ పురాణాల ప్రకారం, ఈ పవిత్ర నది నగరపు పాపాలను కడుగుతుందని నమ్మకం.
సరయూ నదీ ఒడ్డున వెలసిన రాముని జన్మస్థలం...
నేటికీ ఈ నది లక్షలాది ప్రజల విశ్వాసానికి కేంద్రంగా ఉంది. సాధువులు, సన్యాసులు సరయూ నదిని పూజిస్తారు. భారతదేశంలోని అతిపెద్ద రామ మందిరాన్ని అయోధ్యలో సరయూ నదికి సమీపంలో నిర్మించారు. ఇది సరయూ నది ఒడ్డున ఉన్న ఒక ప్రధాన పర్యాటక ప్రదేశం. హనుమాన్ గర్హి ఆలయం- సరయూ నదికి సమీపంలో ఉన్న హనుమాన్ గర్హి కూడా ఒక ప్రధాన యాత్రా స్థలం. రాముని కాలంలో హనుమంతుని ఇల్లు ఇక్కడ ఉండేదని ప్రతీతి. సరయూ నదికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ నది ఆత్మను శుద్ధి చేస్తుందని ఇక్కడివారి నమ్మకం. ఈ నది చుట్టూ ఉన్న అందమైన పర్యాటక ప్రదేశాలను చూడాలనుకుంటే, తప్పకుండా ఒకసారి అయోధ్యను మాత్రం సందర్శించాల్సిందే.



Click it and Unblock the Notifications













