మన దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల్లో విశిష్టమైన దేవాలయం గురించి మనం ఇప్పుడు చెప్పుకొందాం. ఇక్కడ ప్రార్థించిన 24 గంటల్లోపు వర్షం వస్తుంది. ఈ నేపథ్యంలో ఆ దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం....
సూరిముత్తు అయ్యనార్ దేవాలయం
P.C: You Tube
అరుల్మిగు సూరిముత్తు అయ్యనార్ దేవాలయం పాపనాశనం, కరయియార్ జలాశయం మధ్య ఉంది. నెల్లై జిల్లా అంబ సముద్రం తాలూకా తారరవరూని నదీ తీరంలో ఈ దేవాలయం ఇదే.
సూరిముత్తు అయ్యనార్ దేవాలయం
P.C: You Tube
ఇది దక్షిణ భారత దేశంలోని మొదటి అయ్యప్ప దేవస్థానం. వివాహం అయ్యి చాలా ఏళ్లు అయినా కూడా సంతానం లేని వారు ఎక్కువగా ఈ దేవాలయానికి వస్తుంటారు.
సూరిముత్తు అయ్యనార్ దేవాలయం
P.C: You Tube
దీని వల్ల వారికి సంతానం కలుగుతుందని నమ్ముతారు. అదే విధంగా భూత, ప్రేతాల వల్ల బాధలు పడుతున్నవారు కూడా ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు.
సూరిముత్తు అయ్యనార్ దేవాలయం
P.C: You Tube
అదే విధంగా పాడి రైతులు ఈ దేవాలయం లోని దేవుడిని పూజిస్తే తమ పశువులు ఎక్కువగా పాలిస్తాయని నమ్ముతారు. పాడిరైతులు ఈ దేవాలయానికి కంచుగంటను కానుకగా అందిస్తారు.
సూరిముత్తు అయ్యనార్ దేవాలయం
P.C: You Tube
ఇక్కడ మరో విశేషం ఏమిటంటే స్థానికులు ఈ దేవుడిని ప్రార్థించిన 24 గంటల్లోపు వర్షం వస్తుందని చెబుతారు. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి.
సూరిముత్తు అయ్యనార్ దేవాలయం
P.C: You Tube
ఇక్కడ దగ్గర్లోని తమైరాబరాని నది అందాలు కూడా చూడదగినవి. తమైరాబరాని నది పశ్చిమ కనుమల్లోని పూదిగై అనే ఒక చిన్న గుట్ట పై ఉన్న అగస్టార్కుడమ్ అనే చోట జన్మిస్తుంది.
సూరిముత్తు అయ్యనార్ దేవాలయం
P.C: You Tube
ఇది అంబాసముద్రం తాలూకాలోని పాపనాశం వైపు గల గల మంటూ పరుగెత్తుంతుంది. ఇది దక్షిణ భారత దేశంలోని తమిళనాడులోని తిరునల్వేలి, ట్యూటికోరిన్ జిల్లాల ద్వారా మన్నార్ నదీలోయ ప్రాంతాల వైపు పరుగెడుతుంది.