శ్రీ రామనవమికి ఈ ఐదు ఆలయాలు చాలా ప్రత్యేకమైనవి
రామ నవమి హిందూ మతంలో ఓ ప్రధానమైన పండగ. అందుకే, రామ నవమి పండుగను గొప్ప వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 30న పండుగ జరుపుకోనున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో దేశంలోని ప్రసిద్ధ శ్రీరామ మందిరం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. హిందూ క్యాలెండర్ ప్రకారం, శ్రీ రాముడు చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో జన్మించాడు. ఈ రోజున భక్తులు శ్రీరాముని జయంతిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో అనేక శ్రీరామ దేవాలయాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది, అయితే అయోధ్యతో పాటు, దేశంలోని అనేక ప్రదేశాలలో శ్రీరాముని ఆలయాలు ఉన్నాయి.

రఘునాథ్ ఆలయం
ఈ ఆలయం జమ్మూ కాశ్మీర్లో ఉంది. రఘునాథ్ ఆలయం భక్తులలో నిత్యం చాలా రద్దీగా ఉంటుంది. దేశనలుమూలల నుంచీ ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. అంతలా చాలా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం. ఈ ఆలయంలో రాముడు, సీత మరియు లక్ష్మణుల భారీ విగ్రహాలు ఉన్నాయి. ఇది కాకుండా, మీరు ఇక్కడ రామాయణం, మహాభారతం యొక్క పాత్రల సంగ్రహావలోకనం కూడా చూడవచ్చు. అదే ఇక్కడి ప్రత్యేకత.

రామ రాజ మందిరం
మధ్యప్రదేశ్లోని ఓర్చాలో రామరాజ ఆలయం ఉంది. ఇక్కడ శ్రీరాముడు రాజుగా పూజింపబడతాడు. ఏడాది పొడవునా భక్తుల రద్దీ ఉన్నప్పటికీ, రామ నవమి సందర్భంగా ఇక్కడ అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. శ్రీరాముని పరిపాలన గూర్తి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

కాలారం దేవాలయం
నాసిక్లో ఒకటి కంటే ఎక్కువ అందమైన శ్రీరామ ఆలయాలు ఉన్నప్పటికీ, కాలారామ్ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ శోభ భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఆధ్యాత్మిక చింతనను మరింత చేరువ చేసే ఈ ఆలయ ప్రాంగణంలో ఎక్కువగా రామభక్తులు ధ్యానంలో కనిపిస్తారు. వారి ఆశిస్సుల కోసం భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. ఈ రామ నవమికి మీరు తప్పక ఈ ఆలయాన్ని సందర్శించాలి.

రామస్వామి దేవాలయం
రామస్వామి దేవాలయం దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం రాముడికి అంకితం చేయబడింది. ఈ అందమైన ఆలయం తమిళనాడులో ఉంది. రామ నవమి రోజున ఈ ఆలయాన్ని సందర్శించడం భక్తులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ రోజున ఆ స్వామివారి దర్శనం కలిగితే సకల పాపాలూ తొలిగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకోసం దేశనలుమూలల నుంచి భక్తులు వస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.

రాంచౌరా ఆలయం
రామ్చౌరా ఆలయం బీహార్లోని హాజీపూర్ జిల్లాలో ఉంది. ఇది ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. రామ నవమి సందర్భంగా ఈ ఆలయ అలంకరణ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పూర్తిగా పూలతో చేసే ప్రత్యేక అలంకరణ చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. శ్రీ రాముడు జనక్పూర్కు వెళుతున్నప్పుడు ఇక్కడకు వెళ్లాడని నమ్ముతారు. అలా శ్రీరాముడు నడియాడిన నేలగా కూడా ఈ ప్రాంతానికి మంచి పేరుంది.



Click it and Unblock the Notifications













