సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబాలు ఈ ప్యాలెస్లు..
భారతదేశం దాని గొప్ప సాంస్కృతిక వారసత్వం, అద్భుతమైన రాజభవనాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి వైవిధ్యం ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంటుంది. ఈ దేశం దాని సొంత ప్రత్యేక మాండలికం, జీవనశైలలను కలిగి ఉంది. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఈ దేశ ఆచారాలకు ఆకర్షితులవుతారు. అందుకే ఇక్కడి ప్రాంతాలను సందర్శించేందుకు వస్తుంటారు. భారతదేశంలో ఇటువంటి అనేక భవనాలు మరియు స్మారక చిహ్నాలు కూడా ఎన్నో ఉన్నాయి. భారతదేశంలోని ప్యాలెస్లు చాలా కాలం నుండి ప్రజలలో ఆకర్షణ కేంద్రాలుగా ఉన్నాయి. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి చెందిన అనేక అద్భుతమైన ప్యాలెస్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న కొన్ని అద్భుతమైన రాజభవనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఉమైద్ భవన్ ప్యాలెస్, జోధ్పూర్
రాజస్థాన్లోని ఈ ప్యాలెస్ ప్రపంచంలోని అతిపెద్ద ప్రైవేట్ నివాసాలలో ఒకటి. దీని గొప్ప నిర్మాణం రాజ్పుత్ మరియు ఆర్ట్ డెకో నిర్మాణ శైలులను ప్రతిబింబిస్తుంది. ఉమైద్ భవన్ ప్యాలెస్, మ్యూజియం "బ్లూ సిటీ" జోధ్పూర్ నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక కొండపై ఉంది. ఇది చిత్తర్ కొండపై ఉంది. ఈ కారణంగా ఉమైద్ భవన్ను చిత్తర్ ప్యాలెస్ జోధ్పూర్ అని కూడా పిలుస్తారు. మహారాజా ఉమైద్ సింగ్ కరువు కారణంగా వేలాది మంది గ్రామస్తులకు ఉపాధి కల్పించేందుకు ఈ ప్యాలెస్ని నిర్మించారు. దీని నిర్మాణం చాలా నెమ్మదిగా జరిగింది.

సిటీ ప్యాలెస్ జైపూర్
జైపూర్ నడిబొడ్డున ఉన్న సిటీ ప్యాలెస్ రాజ్పుత్, మొఘల్, యూరోపియన్ ఆర్కిటెక్చర్కు ప్రసిద్ధి చెందిన అద్భుతమైన కాంప్లెక్స్. ఈ ప్యాలెస్లో అనేక రాజభవనాలు, ప్రాంగణాలు మరియు తోటలు ఉన్నాయి. జైపూర్లోని సిటీ ప్యాలెస్ 1729-1732 మధ్య జైపూర్లో నిర్మించబడింది. ఈ ప్యాలెస్ వారసత్వం, గొప్ప సంస్కృతిని చిత్రీకరిస్తుంది. సవాయ్ జై సింగ్ II ఈ ప్యాలెస్ పనిని ప్రారంభించాడు.
మైసూర్ ప్యాలెస్, మైసూర్
ఈ ప్యాలెస్ను అంబా విలాస్ ప్యాలెస్ అని కూడా అంటారు. ఇది మైసూర్ రాజకుటుంబమైన వడియార్ రాజవంశపు అధికారిక నివాసం. ఈ ఇండో-సార్సెనిక్ స్టైల్ ప్యాలెస్ దాని సున్నితమైన చెక్కడం, అందమైన ఇంటీరియర్స్, గ్రాండ్ దర్బార్ హాల్కు ప్రసిద్ధి చెందింది. ఇది ఒక చారిత్రక రాజభవనం, రాజ నివాసం. ఇది కర్ణాటకలోని మైసూర్లో ఉంది. ఈ ప్యాలెస్ మైసూర్ మధ్యలో ఉంది. అంతేకాకుండా, తూర్పు వైపు చాముండి కొండలకు ఎదురుగా ఉంది. మైసూర్ను సాధారణంగా 'ప్యాలెస్ల నగరం' అని వర్ణిస్తారు.
లేక్ ప్యాలెస్, ఉదయపూర్
ఉదయపూర్లోని పిచోలా సరస్సుపై ఉన్న లేక్ ప్యాలెస్, తెల్లటి పాలరాతి రాజభవనం. ఇది నీటి నుండి పైకి కనిపిస్తుంది. ఇది ఇప్పుడు ఒక విలాసవంతమైన హోటల్. ఈ ప్రాంతంలో సరస్సు, చుట్టుపక్కల ఉన్న ఆరావళి పర్వతాల ఉత్కంఠభరితమైన వీక్షణలను చూడొచ్చు.

జై విలాస్ ప్యాలెస్, గ్వాలియర్
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఉన్న ఈ ప్యాలెస్ సింధియా రాజవంశపు నివాసం. ఈ ప్యాలెస్ వాస్తుశిల్పం, యూరోపియన్-శైలి అలంకరణలు, కళాకృతులకు ప్రసిద్ధి చెందింది. గ్వాలియర్ మహారాజు, జయజీ రావు సింధియా, 1874లో అప్పటి వేల్స్ యువరాజు ఎడ్వర్డ్ VII రాజుకు ఘన స్వాగతం పలికేందుకు ఈ అద్భుతమైన భవనాన్ని నిర్మించారు. నేడు, ఇది రాజ మరాఠా సింధియా కుటుంబానికి చెందిన వారసులకు నివాసంగా ఉంది.



Click it and Unblock the Notifications














