Search
  • Follow NativePlanet
Share
» »వందే భారత్‌లో ప్ర‌యాణించి.. భువనేశ్వర్‌లో చూడాల్సిన ప్ర‌దేశాలు!

వందే భారత్‌లో ప్ర‌యాణించి.. భువనేశ్వర్‌లో చూడాల్సిన ప్ర‌దేశాలు!

విశాఖపట్నం నుండి భువనేశ్వర్ వరకు కొత్తగా ప్రకటించిన వందే భారత్ ద్వారా 468 కిలోమీట‌ర్ల దూరాన్ని కేవలం ఆరు గంటల ప్రయాణంతో చేరుకోవ‌చ్చు. ఈ హై-స్పీడ్ రైలు మార్చి 17, 2024న నుంచి శ‌నివారం మిన‌హా ఆరు రోజులు న‌డుస్తోంది. విశాఖ‌లో మధ్యాహ్నం 3:30 గంటలకు బ‌య‌లుదేరి, రాత్రి 9:30 గంటలకు ఈ ట్రైన్ భువనేశ్వర్ చేరుకుంటుంది. విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ రైలు హాల్టింగ్ ఉండ‌డంతో ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్‌ను అడుగుపెట్టేందుకు ఎంతో అనువుగా ఉంటోంది. దీంతో చారిత్ర‌క న‌గ‌రంగా పేరొందిన భువ‌నేశ్వ‌ర్ న‌గ‌ర ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను వీకెండ్‌లో చూసేందుకు ఓ ట్రిప్ ప్లాన్ చేసుకోవ‌చ్చు. అక్క‌డి సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాల విశేషాలు మీకోసం..

శుక్రవారం వైజాగ్ నుండి వందేభార‌త్‌లో మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఎంతో సౌకర్యవంతమైన ఈ రైలు ప్ర‌యాణంలో ఆహ్లాద‌క‌ర‌మైన‌ రైడ్‌ను ఆస్వాదించండి. భువనేశ్వర్‌కు చేరుకుని, మీకు అనువుగా ఉండే వసతి గృహాన్ని ఎంపిక చేసుకోండి. అలా శనివారం నగరాన్ని అన్వేషించి.. ఆదివారం ఉదయం 5:15 గంటలకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఎక్కితే ఉదయం 11:00 గంటలకు విశాఖ న‌గ‌రాన్ని చేరుకోవ‌చ్చు.

shantipagoda1

భువనేశ్వర్‌లోని ప్ర‌సిద్ధిచెందిన దేవాలయాలు..

ఒడిషా రాజధాని భువ‌నేశ్వ‌ర్‌ 8వ మరియు 12వ శతాబ్దాల నిర్మిత‌మైన రాతి ఆల‌యాల‌కు ఎంత‌గానో ప్ర‌సిద్ధి చెందింది. చారిత్ర‌క న‌గ‌రంగా పేరొందిన ఇక్క‌డి ఆల‌య నిర్మాణ శైలి మ‌న‌సును క‌ట్టిప‌డేస్తుంది. అంత‌టి పురాత‌న నేప‌థ్యం ఉన్న దాదాపు 700 దేవాలయాలు ఇప్పటికీ చరిత్ర‌కు ఆన‌వాలుగా ద‌ర్శ‌న‌మిస్తాయి. భువనేశ్వర్‌లోని లింగరాజ ఆలయం హిందూ దేవాలయాల‌లో ప్ర‌థ‌మంగా నిలుస్తుంది. క్రీస్తుశ‌కం1025 మరియు 1065 మధ్య నిర్మించబడిన ఇది కళింగ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. దాదాపు 180 అడుగుల పొడవుతో భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఈ ఆల‌యం కీర్తికెక్కింది. ఆలయానికి ఉత్తరాన నిర్మలమైన బిందు సాగర్ సరస్సులో ప‌ర్యాట‌కులు షికారు చేయవచ్చు. రాజారాణి ఆలయం, ముక్తేశ్వరాలయం, అనంత వాసుదేవ దేవాలయం, భహ్మేశ్వరాలయం యాత్రికులు సందర్శించగల ఇతర ముఖ్యమైన ఆలయాలు.

శాంతి స్థూపం లేదా శాంతి పగోడా

ధౌలి కొండలు అపారమైన చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఇక్కడ పురాణ కళింగ యుద్ధం జరిగినట్లు నమ్ముతారు.

అశోక చక్రవర్తి, యుద్ధం యొక్క వినాశకరమైన పరిణామాలను చూసిన తర్వాత తీవ్ర పరివర్తన చెంది, హింసను విడిచిపెట్టాడు. ఈ కీలక ఘట్టాన్ని గుర్తుచేసుకోవడానికి శాంతి స్థూపం ధౌలి గిరి కొండలపై నిర్మించబడింది. ఈ ఐకానిక్ నిర్మాణాన్ని తప్పకుండా సందర్శించండి. అలాగే, ధైలీ గిరి హిల్స్ పాదాల వద్ద ఉన్న శాసనాలతో చక్రవర్తి అశోకచే చెప్ప‌బ‌డ్డ‌ అహింస శాసనాలు కూడా ఇక్క‌డ ఉన్నాయి.

khandagiricaves

ఖండగిరి.. ఉదయగిరి గుహలు

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) చేత 'తప్పక చూడవలసిన' భారతీయ వారసత్వ ప్రదేశంగా పరిగణించబడిన ఈ గుహలు అపారమైన చారిత్ర‌క ఆధారాల‌కు నిల‌యంగా ఉన్నాయి. సహజ నిర్మాణాలతోపాటు శిల్ప సౌంద‌ర్యానికి ఈ గుహ‌లు ప్ర‌తీక‌. ఈ గుహలు 6వ శతాబ్దం BCలో ఖరవేల రాజు పాలనలో జైన సన్యాసులకు నివాస స్థలాలుగా ఉపయోగించబడ్డాయి.

మ్యూజియమ్‌లు

ఒడిశా స్టేట్ ట్రైబల్ మ్యూజియం పర్యాటకులకు ఎంతో ఇష్టమైన ప్ర‌దేశంగా పేరుగాంచింది. కేంద్రపాలిత ప్రాంతం దాద్రా మరియు నగర్ హవేలీలోని స్థానిక ప్రజల జీవితాల్లోకి మనోహరమైన దృశ్యాల‌ను ఈ ప్ర‌దేశం అందిస్తుంది అన‌డంలో సందేహాం లేదు. సందర్శకులు ఈ ప్రాంతంలోని అటవీ ప్రాంతాలలో మరియు చుట్టుపక్కల నివసించే వర్లీ, దోధియా, కోక్నా మరియు కథోడియా వంటి కమ్యూనిటీల యొక్క గొప్ప మరియు శక్తివంతమైన సామాజిక-సాంస్కృతిక వారసత్వాన్ని అన్వేషించవచ్చు. వీటితో పాటు అదనంగా, రీజనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీని కూడా సందర్శించవచ్చు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+