Search
  • Follow NativePlanet
Share
» »శవాల బుడిదను ప్రసాదంగా ఇచ్చే దేవాలయం ఎక్కడ వుందో మీకు తెలుసా ?

శవాల బుడిదను ప్రసాదంగా ఇచ్చే దేవాలయం ఎక్కడ వుందో మీకు తెలుసా ?

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ నగరంలో కొలువైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఎంతో ప్రాముఖ్యత కలిగివుంది. ఈ ఆలయం భూమి మీద వున్న 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా కొన్ని లక్షల సంవత్సరాల నుండి పూజలందుకుంటుంది.

By Venkatakarunasri

ఉజ్జయినిని ఉజ్జైన్, ఉజైన్, అవంతీ మరియు అవంతిక అని కూడా అంటారు. ఇది మధ్యప్రదేశ్లో గలదు. ప్రాచీన భారతదేశంలో ఇది అవంతీ రాజ్యానికి రాజధానిగా వుండినది. ఇది హిందువుల ఏడు పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇచట 12 ఏండ్లకు ఒక సారి జరుగు కుంభమేళా ఇక్కడే జరుగుతుంది. 12 శివక్షేత్రాల జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఈ నగరంలోనే గలదు. కోటిసూర్యుల సమప్రభుడు, మహాదివ్యతేజోమయుడు, సమస్తసృష్టి లయకారుడు, అర్ధనారీశ్వరుడు, అద్వైత భాస్కరుడు, పంచభూతాత్మకుడు, దుర్జనభయంకరుడు,సజ్జన సుభంకరుడు ఇలా ఎంత పొగడినా ఎన్ని సంవత్సరాలు వేడినా తనివి తీరదు ఆ మహేశ్వరునిపై వున్న భక్తి.

ఎన్నో కోట్ల మంది గుండెల్లో కోట్లాది సంవత్సరాలైనా చెరిగిపోనిది మరువరానిది మహాశివుని స్మరణ. ఆయనపై ఎల్లలు లేని మహాభక్తి భావం వలన ఆయన వెలసిన ప్రతిచోటూ మహా పుణ్యధామంగా భాసిల్లుతోంది. వాటిలో ద్వాదశజ్యోతిర్లింగాలకు మరీ ప్రత్యేకస్థానం భక్తుల గుండెల్లో పాతుకుపోయింది. ఆ ద్వాదశజ్యోతిర్లింగాల్లో ఒకటై ఆచారవ్యవహారాల్లో ఒక ప్రత్యేక స్థానంతో పాటు ఇప్పటికీ అంతుచిక్కని ఎన్నో విషయాలను కలిగివుంది ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం.

శవాల బుడిదను ప్రసాదంగా ఇచ్చే దేవాలయం ఎక్కడ వుందో మీకు తెలుసా ?

టాప్ 5 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

శవాల బుడిదే అక్కడి ప్రత్యేకత

శవాల బుడిదే అక్కడి ప్రత్యేకత

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ నగరంలో కొలువైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఎంతో ప్రాముఖ్యత కలిగివుంది. ఈ ఆలయం భూమి మీద వున్న 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా కొన్ని లక్షల సంవత్సరాల నుండి పూజలందుకుంటుందని భక్తుల విశ్వాసం.

pc:youtube

శవాల బుడిదే అక్కడి ప్రత్యేకత

శవాల బుడిదే అక్కడి ప్రత్యేకత

ఈ ఆలయంలోని పరమేశ్వరుడు స్వయంభూగా వెలసాడని భక్తులు చెపుతున్నారు. అయితే ఈ ఆలయాన్ని ఎవరు కట్టారు ఎప్పుడు కట్టారు. అనేది అంతుచిక్కని మిస్టరీ. ఈ ఆలయంలో విగ్రహాన్ని దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు.

ఉజ్జయిని అసంఖ్యాక పౌరాణిక కథల సంగమ ప్రదేశం !

pc:youtube

శవాల బుడిదే అక్కడి ప్రత్యేకత

శవాల బుడిదే అక్కడి ప్రత్యేకత

ఎందుకంటే ఈ శివలింగం యొక్క ముఖం దక్షిణం వైపు వుంటుంది. ఈ విలక్షణం మరే శివాలయంలో వుండదు. ఈ ఆలయంలో గర్భగుడిలోని తూర్పు, పశ్చిమ, ఉత్తర గోడలపై గణపతి, పార్వతీదేవి, కార్తికేయుని విగ్రహాలు అమర్చబడి వుంటే దక్షిణాన నందీశ్వరుడు కొలువై వుంటాడు.

గుణ - హనుమంతుని శక్తులలో ఒకటి !

pc:youtube

శవాల బుడిదే అక్కడి ప్రత్యేకత

శవాల బుడిదే అక్కడి ప్రత్యేకత

ఉజ్జయినిలో మొత్తం మూడు లింగాలు దర్శనమిస్తాయి. ఈ మూడు లింగాలు మూడు అంతస్తులలో ప్రతిష్టింపబడివున్నాయి. మొదటి అంతస్తులో మహాకాళ లింగం. రెండవ అంతస్తులో ఓంకార లింగం, మూడవ అంతస్తులో నాగచంద్రేశ్వర లింగం కొలువై వున్నాయి.

మధ్య ప్రదేశ్ లో పది పర్యాటక ఆకర్షణలు!

pc:youtube

శవాల బుడిదే అక్కడి ప్రత్యేకత

శవాల బుడిదే అక్కడి ప్రత్యేకత

వీటిలో నాగచంద్రేశ్వర లింగం కేవలం నాగ పంచమి నాడే భక్తుల దర్శనార్ధం అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో వున్న మరో విశేషం అక్కడి ప్రసాదం, సాధారణంగా ఎక్కడైనా దేవుడికి పెట్టిన ప్రసాదం మరో దేవుడికి పెట్టారు. కానీ ఈ ఆలయంలో ప్రసాదం మరే దేవునికైనా ప్రసాదంగా సమర్పించవచ్చట.

శృంగారతత్వాన్ని చాటి చెప్పే ఖజురహో శిల్పాలు !

pc:youtube

శవాల బుడిదే అక్కడి ప్రత్యేకత

శవాల బుడిదే అక్కడి ప్రత్యేకత

ఈ ఆలయంలో యుగయుగాలుగా ఒక అద్భుత సంఘటన జరుగుతుంది. ప్రతిసంవత్సరం వర్షాకాలానికి ముందు పర్జన్యానుస్టానం అనే ఒక అనుస్టానం జేస్తారు. అయితే కార్యక్రమం పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి భారీ వర్షం కురుస్తుంది.

'బంగారం' ను ప్రసాదంగా ఇచ్చే మహాలక్ష్మి దేవాలయం !!

pc:youtube

శవాల బుడిదే అక్కడి ప్రత్యేకత

శవాల బుడిదే అక్కడి ప్రత్యేకత

ఈ మహాద్భుతం ఎలా జరుగుతుందీ అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ ఆలయంలోని మహాకాళేశ్వరుని లింగం క్రింద శంఖ యంత్రం ఒకటి వుందని ఆ యంత్రంలో అంతులేని శక్తి దాగివుందని అక్కడి వారు అంటారు. అందుకే శివార్చన సమయలో శంఖం వూదుతారు.

'బంగారం' ను ప్రసాదంగా ఇచ్చే మహాలక్ష్మి దేవాలయం !!

pc:youtube

శవాల బుడిదే అక్కడి ప్రత్యేకత

శవాల బుడిదే అక్కడి ప్రత్యేకత

ఈ ఆలయంలో జరిగే మహత్తర కార్యం భస్మ హారతి. ఈ ఆలయంలో భస్మ మందిరం అని ఒకటి వుంది. ఇందులోనే ఈ కార్యం నిర్వహిస్తారు. భాస్మప్రియుడుగా పిలిచే ఆ పరమేశ్వరుని భస్మంతో అభిషేకిస్తారు. ప్రతిరోజూ తెల్లవారు జామున 4 గంల కు ఈ భాస్మహారతి లేదా భాస్మాభిషేకం చేస్తారు.

రైళ్ళను ఆపే గుడి ఎక్కడ వుందో మీకు తెలుసా?

pc:youtube

శవాల బుడిదే అక్కడి ప్రత్యేకత

శవాల బుడిదే అక్కడి ప్రత్యేకత

ఈ అభిషేకం రెండు రకాలుగా వుంటుంది. మొదటిది ఆవు పేడను పిడకలు చేసి వాటిని కాల్చగా వచ్చిన భస్మాన్ని తెల్లటి వస్త్రంలో కట్టి శివుని ముఖంపై ఒక తెల్లటి వస్త్రం కప్పి ఆ భస్మ మూటను లింగం చుట్టూ తిప్పుతూ భాస్మాభిషేకం చేస్తారు.

భారతదేశంలో అంతగా ఎవ్వరికీ తెలియని సినిమా షూటింగ్ లకు అనువైన 10 కోటలు !

pc:youtube

శవాల బుడిదే అక్కడి ప్రత్యేకత

శవాల బుడిదే అక్కడి ప్రత్యేకత

ఆ మహత్తర ఘట్టాన్ని చూడటానికి రెండు కళ్ళూ సరిపోవనే చెప్పాలి. ఆ సమయంలో మనకు తెలియని అలౌకిక అనుభూతిలోకి వెళ్ళినట్లు వుంటుందని భక్తులు చెపుతారు.ఇక రెండవ భాస్మాభిషేకం కొన్ని ఆంక్షల మధ్య జరుగుతుంది.

రాజ భోజుడి వైభోగం !

pc:youtube

శవాల బుడిదే అక్కడి ప్రత్యేకత

శవాల బుడిదే అక్కడి ప్రత్యేకత

అభిషేకం చేసే సమయంలో స్త్రీలను గుడిలోకి అనుమతించారు. ఆ సమయలో కేవలం మగవారికి మాత్రమే అనుమతి వుంటుంది. శివుణ్ణి స్మశానవాశిగా కూడా పిలుస్తారు. కాబట్టి అప్పుడే కాలిన శవం యొక్క బూడిదను తీసుకువచ్చి ఆ లింగానికి అభిషేకం చేస్తారు.

pc:youtube

శవాల బుడిదే అక్కడి ప్రత్యేకత

శవాల బుడిదే అక్కడి ప్రత్యేకత

ఈ కార్యం 10మంది నాగాసాదువుల చేతుల మీదుగా జరుగుతుంది. ఈ భాస్మహారతి వల్ల ఆలయాన్ని మహాస్మాశానం అని కూడా పిలుస్తారు. ఈ కార్యాన్ని ఎవరైతే చేస్తారో వారికి మరుజన్మ వుండదని అంటారు.

మధ్య ప్రదేశ్ లో పది పర్యాటక ఆకర్షణలు!

pc:youtube

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+