కాశీ విద్యాపీఠ్ కి 1995 లో మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్ అని పేరు పెట్టారు, ఇది బ్రిటీషు వారికి వ్యతిరేకంగా జరిగిన భారత స్వాతంత్ర్య ఉద్యమానికి కేంద్రంగా ఉండేది. ఈ విద్యాపీఠ౦ ఒక ప్రఖ్యాత జాతీయవాది, విద్యావేత్త అయిన బాబు శివ ప్రసాద్ గుప్తా గారి ఆధ్వర్యంలో ఏర్పడింది. ఆయన దీనిని మహాత్మా గాంధీ, మరో సంఘ సంస్కర్త మొదటి చాన్సిలర్ గా పనిచేసిన డాక్టర్.భగవాన్ గారి సహాయంతో నిర్మించారు. యాదృచ్చికంగా, బనారస్ లోని పఖ్యత భారత మాత ఆలయ స్థాపన వెనుక ఈయన స్ఫూర్తి కూడా ఉంది.
ఈ విద్యాపీఠ౦ 1963 లో యు జి సి ద్వారా అనుబంధ విశ్వవిద్యాలయం హోదాను పొందింది, దీనిని భగవద్గీత, ఖురాన్ ప్రవచనాల మధ్య నుండి 1921, ఫిబ్రవరి 10 న వసంత పంచమిరోజు మహాత్మా గాంధీచే ప్రారంభించబడింది.
దీని మొదటి నిర్వహణా బోర్డులో మహాత్మా గాంధీ, లాలా లజపతి రాయ్, పండిట్ జవహర్ లాల్ నెహ్రు, జమునాలాల్ బజాజ్, ఆచార్య నరేంద్ర దేవ్ తోపాటు పి.డి.టాండన్, బాబు శివ ప్రసాద్ గుప్తా, డాక్టర్.భగవాన్ దాస్ వంటి ప్రముఖ దేశభక్తులు ఉండేవారు.
ఈ విద్యాపీఠ ప్రముఖ పూర్వ విద్యార్ధులు కొందరు చంద్రశేఖర ఆజాద్, పండిట్ కమలాపతి త్రిపాఠి, లాల్ బహదూర్ శాస్త్రి, బి.వి.కేస్కర్, మననత్నాథ్ గుప్తా, భోల పాశ్వాన్ శాస్త్రి, రామకృష్ణ హెగ్డే, ప్రొఫెసర్.రాజా రామ్ శాస్త్రి మరికొందరు వీరితోపాటు ఉండేవారు.