ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న వారణాసికి 50 కీమీ దూరం లో చందౌలీ ఉంది. చంద్ర షా వారణాసి ని స్థాపించిన బరౌలియా రాజ పుత్రుడయిన నారోత్తం రాయ్ వంశానికి చెందినవాడు. ఈ చంద్ర షా పేరు మీదుగానే చందౌలీ కి ఆ పేరు వచ్చింది. ఆ తరువాత ఇతని వారసులు ఒక కోటని నిర్మించారు. ఈ కోట శిధిలావస్థకి చేరుకున్నా కానీ సందర్శకులని ఆకర్షిస్తూనే ఉంటుంది.
చందౌలీ చుట్టుపక్కల గల పర్యాటక స్థలాలు
చందౌలీ చుట్టూ అనేక పర్యాటక స్థలాలున్నాయి.”హకియా కాలీ మందిర్”,”లతీఫ్ షా సమాధి” కూడా చందౌలీ కి దగ్గరలోనే ఉన్నాయి. కాని ఇక్కడి ముఖ్య పర్యాటక స్థలం చందౌలీ వన్య ప్రాణి సంరక్షణా కేంద్రం. ఇక్కడ అనేక జాతులకి చెందిన జంతువులు,పక్షులు,తీగలు ఉన్నాయి. కానీ భారతదేశం లో ఈ సంరక్షణా కేంద్రం చాలా తక్కువ మందికే తెలుసు పర్యాటకులు విపరీతంగా వచ్చే ప్రదేశాలకి దూరంగా ఉండబట్టి దీని శొభ ఇంకా అలాగే ఉంది. ఈ సంరక్షణా కేంద్రాన్ని ఆసియా సింహాల సంరక్షణార్ధం నిర్మించారు. ఈ జాతి సింహాల సంఖ్య గణనీయంగా పడిపోయినా ఇక్కడ అనేక రకాల జంతువులు,పక్షులు ఉన్నాయి. దీనిలోనే దట్టమయిన అడవులు,పిక్నిక్ కి అనువుగా ఉండే ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఈ కేంద్రం లోనే "రాజ్ దరి", " దేవ్ దరీ" గా పిలువబడే రెండు జలపాతాలు ఉన్నాయి.