యమునోత్రి టెంపుల్ గర్హ్వాల్ హిమాలయాలకు పడమటి వైపున సముద్ర మట్టానికి 3235 మీ.ల ఎత్తున కలదు. ఇక్కడ యమునా దేవి విగ్రహం ఒకటి వుంటుంది. దీనితో పాటు హిందూ దేముడు యమ ధర్మ రాజు విగ్రహం కూడా వుంటుంది. యమ ధర్మ రాజును యమునా దేవి సోదరుడి గా పరిగణిస్తారు. ఈ టెంపుల్ ను మొదటగా 19 వ శతాబ్దంలో జైపూర్ మహారాజు గులేరియా నిర్మించారు. ఇది చార్దాం గా చెప్పబడే నాలుగు టెంపుల్స్ లో ఒకటి. ఈ టెంపుల్ ద్వారాలు 'అక్షయ త్రితీయ' నాడు మాత్రమే తెరుస్తారు. దీపావళి రెండవ రోజున మరల మూసి వేస్తారు. యమునా నది జన్మ స్థలమైన యమునోత్రి దీనికి సమీపం లోనే కలదు. యమునోత్రిలోని ఇతరాకర్షణలు అంటే ఇక్కడకల వేడి నీటి బుగ్గలు సూర్య కుండ్ మరియు గౌరీ కుండ్ లు.



Click it and Unblock the Notifications