ఆలీబాగ్ లో సోమేమేశ్వర దేవాలయం ప్రసిద్ధి చెందినది. సుమారు 3 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయం శాతవాహనుల కాలం నాటిది. సోమేశ్వర దేవాలయంలో శివుడి విగ్రహం పూజించబడుతుంది. ఒకప్పుడు శివుడు పూర్తిగా విషం నిండిన సముద్రాన్ని తాగాడని, అపుడు ఆ నీరంతా తేనెగా మారిందని చెపుతారు. శివుడి ఆశీస్సుల కొరకు భక్తులు తండోపతండాలుగా వస్తారు. ఈ దేవాలయానికి వచ్చే వారు మార్గంలో ఎన్నో శిలలను చూస్తారు. వీటిలో ఒక శిల దీపస్తంభానికి దగ్గిరగా ఉంటుంది.