దూధతోలి సముద్ర మట్టానికి 3100 మీటర్ల ఎత్తులో ఉన్న అత్యంత అందమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. చివరి బస్ స్టాప్ తలిసైన్ నుండి పర్యాటకులు 24 కి.మీ.ల దూరం ట్రెక్కింగ్ చేసి ఇక్కడికి చేరుకువచ్చు. మిశ్రమ అడవులతో; ఈ స్థలం హిమాలయ శ్రేణుల మరియు వాటి పరిసర ప్రాంతాల మంత్రముగ్దమైన దృశ్యాలు అందిస్తుంది. గఢ్వాల్ లోని గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, చంద్ర సింగ్ గఢ్వాలి ని ఈ స్థలం ఎంతగానో ఆకర్షించింది. అతని ఆఖరి కోరిక ప్రకారం, మరణానంతరం ఒక స్మారక చిహ్నం ఇక్కడ నిర్మించారు.