తేజ్ పూర్ లో బాగా ఆకట్టుకునే విషయం కొలియ భోమోర సేతు. ఇది సోనిత్పూర్ జిల్లాతో నగోన్ జిల్లాని కలిపే ఒక వంతెన. 3.015 కిలోమీటర్ల కొలతలతో ఉన్న ఈ వంతెన నిర్మాణం మెచ్చుకోదగింది. ఈ వంతెన నిర్మాణం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి నా౦దిపలికింది. ఆరు సంవత్సరాలలో నిర్మించిన ఈ ఆలయం (1981 – 1987), అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీచే ప్రారంభించబడింది. ఈ వంతెనను నిర్మించడానికి ముందు దేశంలోని ఈ భాగం బ్రహ్మపుత్ర నది కారణంగా ఇతర ప్రాంతాల నుండి విడదీయబడింది.
ఈ వంతెనకి ప్రసిద్ధ అహోం జనరల్ కొలియ భోమోర ఫుకన్ పేరుపెట్టబడింది. కొలియ భోమోర సేతు కేవలం సోనిత్పూర్ జిల్లాకు లైఫ్ లైన్ గా పనిచేయడమే కాదు, ఇది చాలా అందమైన వంతెన. బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న ఈ వంతెన ఒక ఒడ్డు నుండి ఇంకొక ఒడ్డుకు అద్భుతంగా అనుసంధానించబడి ఉంది. ఈ దృశ్యం ప్రత్యేకంగా సూర్యోదయం, సూర్యాస్తమ సమయాలలో అద్భుతంగా ఉంటుంది.