శ్రీ ఆపత్సహాయేశ్వరార్ ఆలయంలో ప్రధానంగా శివుడిని పూజిస్తారు. ఇక్కడ శివుడిని ఆపత్సహాయేశ్వరార్ గా పూజిస్తారు. శివుడు లింగం ఆకారంలో ఉంటాడు, ఇది “స్వయంభూ” గా పేరుగాంచింది. ఈ ఆలయంలో “కలన్గమార్ కథా వినాయగర్” గా ప్రసిద్ధిగాంచిన వినాయకుడి విగ్రహం, బృహస్పతి లేదా గురు భగవాన్ గా పేరుగాంచిన దక్షిణామూర్తి విగ్రహాలు కూడా ఉన్నాయి.
ఈ ఆలయం గురుగ్రహాన్ని పూజించడానికి లేదా ప్రతి ఏటా గురువు మారినపుడు గురుగ్రహ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఇక్కడికి గుంపులుగా వస్తారు. ఈ సమయంలో ప్రజలు గురుగ్రహానికి ప్రత్యెక పూజలు నిర్వహిస్తారు. గురుగ్రహాన్ని పూజించడానికి గురువారం ప్రత్యేకమైన రోజు, అందువల్ల వారంలో ఆరోజు ప్రత్యెక పూజలు నిర్వహించబడతాయి.
ఈ ప్రాంతానికి అలంగుడి అనేపేరు ఒక పాత కధనుండి ఉద్భవించి౦ది. “పాలకడలి” (స్వర్గపు సముద్రం) ని చిలికే సమయంలో, వాసుకి అనేపేరుగల పాము విషాన్ని దేవతలపై చిందించింది. అపుడు, వారు శివుడిని ప్రార్ధించారు. అపుడు శివుడు ఆ విషాన్ని మింగాడు (హాలహల౦గా పేరుగాంచింది), దానివల్ల ఆ ప్రదేశానికి ఆలన్గుడి అనేపేరు వచ్చింది. ఆ దేవుడు ఆపత్సహాయేశ్వరార్ (ఆపద నుండి రక్షించినవాడు) గా పిలవబడ్డాడు.
అలాగే దేవతలను బాధ పెడుతున్న గజముఖాసురుడి బారి నుంచి వినాయకుడు కాపాడాడు. అందువల్ల ఇక్కడ ఆయనను కలంగమార్ కథా వినాయగర్ అని పూజిస్తారు.
శివుడిని పెళ్లాడడానికి పార్వతీదేవి ఇక్కడే తపస్సు చేసింది అందువలన ఈ ప్రాంతాన్ని తిరుమానమంగళం అని కూడా అంటారు.



Click it and Unblock the Notifications