తిరుమనంచేరి దేవతలు వచ్చి ముడి వేసే ప్రదేశం. నిద్రాణ స్థితిలో ఉన్న దేవాలయ నగరాలకు ప్రసిద్ది గడించిన తమిళనాడులోని ఈ ప్రదేశాలు మరియు చిత్రాలు తమ జవజీవాలతో పర్యాటకులకు స్ఫూర్తినిస్తాయి. తిరుమనంచేరి కావేరి నది తీరాన గల పురారూపాత్మక దేవాలయ నగరం. శైవ మతానికి కేంద్రంగా అనేక సుదూర నగరాలు తమిళ నాట ప్రసిద్ది . అటువంటి నగరాలలో ఒకటి తిరుమనంచేరి, భగవంతుడు శివునకు అన్కితమివ్వబడినది. వివాహాన్ని కోరుకునే యువతి యవకులు భగవంతుడు శివుడిని వివాహం కొరకు పుజిస్తారు. తిరుమనం అంటే వివాహం , చేరి అంటే గ్రామం అని అర్ధం. పురాణం ప్రకారం శివుడు పార్వతి దేవిని పరిణయం ఆడినది ఇక్కడే. తిరుమనంచేరి ని సందర్శించ టం ద్వారా వివాహానికి ఉన్న అవరోధాలు తొలగి పోతాయని చెప్తారు .
ఈ ప్రదేశానికి రోడ్డు ద్వారా మరియు రైల్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. మయిలదుతురై జంక్షన్ రైల్వే స్టేషన్ ఇక్కడికి దగ్గరలోని రైల్వే స్టేషన్, మరియు కుంబకోణం రైల్వే జంక్షన్ కి దగ్గరగా ఉన్నది. చెన్నై నుండి పాండిచేరి కడలూరు దారిలో ఇక్కడికి రోడ్డు ద్వారా చేరుకోవచ్చు. సంవత్సరం పొడవునా వాతావరణం ఇక్కడ సందర్శనకు అనువుగా ఉంటుంది.