ఈ నగరానికి విశేషంగా పర్యాటకులను ఆకర్షించే ఊరేగింపు ఈ పంచలోహ ఉత్సవార్. ఈ పంచ లోహ అంటే అయిదు లోహాలు. దేవాలయాల లోని విగ్రహాలను చేసేందుకు వాడే పంచలోహాల కలయికే ఈ పంచ లోహం. వెండి,ఇనుము, బంగారము,సీసము మరియు రాగిల కలయిక. ఇక్కడి విశేషమేమిటంటే సమూహంగా ఈ పంచలోహాలతో చేసిన విగ్రహాలను ఉత్సవంగా ఊరేగిస్తారు . ఎంతో మంది చుట్టూ పక్కల నగరాల నుండి, పట్టణాల నుండి ఈ ఊరేగింపు చూడటానికి వస్తారు . వేదమంత్రోచ్చారనతో జరిగే ఈ ఊరేగింపు కన్నుల పండువగా ఉంటుంది. ఈ ఉత్సవం జరిగే సమయం లో తిరుమనంచేరిని సందర్శించి న వారికి ఇది ఒక మరపు రాణి జ్ఞాపకంగా మిగిలి పోతుంది.