సెయింట్ జార్జ్ కాథలిక్ చర్చ్ లేదా ఎదుతు పల్లి గా ఎదతు చర్చ్ ప్రసిద్ది. క్రైస్తవుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఈ చర్చ్ ప్రధానమైనది. పంబా నదీ తీరంలో ఉన్న ఈ చర్చ్, మనసును ఉపశమింప చేసే ఈ ప్రశాంత ప్రదేశం గొప్ప భౌగోళిక వాతావరణం కలది. మధ్యయుగపు యూరోపెయన్ నిర్మాణ శైలిలో నిర్మించబడినది ఈ చర్చ్.
ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే పండుగ కేరళ రాష్ట్ర నలుమూలల నించే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులని విశేషంగా ఆకర్షిస్తోంది. నిజానికి, ఈ పండుగ ఇక్కడి ప్రాంతానికి ఆర్ధిక ఆవలంబన కలిగిస్తుంది. పది రోజులు నిర్వహించే ఈ పండుగ ఏప్రిల్ 27 న మొదలై మే 7 వరకు కొనసాగుతుంది. బసిలికా ప్రాంతానికి మధ్యలో బంగారంతో అలంకరింపబడిన సెయింట్ జార్జ్ విగ్రహాన్ని భక్తుల దర్శనార్ధం తీసుకువస్తారు. ఈ చర్చ్ కి రావడానికి ఎన్నో ప్రైవేటు టాక్సీ లు అందుబాటులో ఉంటాయి.