పతిరమన్నాల్ ని ఒక కలల లోకంగా పరిగణించవచ్చు. అద్భుతమైన సౌందర్యాన్ని సొంతం చేసుకున్న ఈ చిన్న ద్వీపానికి బోటు ద్వారా మాత్రమే చేరగలుగుతాము. రోజు వారి హడావిడి పట్టణ జీవితం నుండి కొంత విరామం తీసుకుని తిరిగి ఉత్తేజాన్ని పొందాలనుకునే వారు ఈ పతిరమన్నాల్ ప్రాంతాన్ని సందర్శించవలసిందే.
ఈ ప్రాంతం ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే గుణాన్ని మరింత పెంపొందిస్తుంది. అంతే కాదు,సూర్యోదయం సూర్యాస్తమయం ఇక్కడ నుండి వీక్షించడం ద్వారా అమితమైన ఆశ్చర్యానుభుతులని పొందుతారు. బ్యాక్ వాటర్స్ ప్రయాణం నుండి మధ్య దారిలో ఈ ద్వీపం ఉంటుంది. పట్టాణ ప్రాంతం లో ని ధ్వనులు మరియు హడావిడి వాతావరణం నుండి విరామం పొందడానికి విచ్చేసిన పర్యాటకులకి ఈ వెంబనద్ సరస్సు, పరిసరాల్లో అందమైన పచ్చటి ప్రకృతి ఏంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. వందలాది స్థానిక మరియు అరుదైన వలస పక్షులకి ఈ ప్రాంతం స్థావరం. పక్షుల కువకువలు ప్రతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మిమ్మల్ని పలకరిస్తూ అంతర్గత శాంతి కి తోడ్పడుతాయి.
సాహసాలని ఇష్టపడే పర్యాటకులకి పక్షులని తిలకించడం మరింత గొప్పగా మరే అనుభూతి. ఈ ద్వీపం అలెప్పి నుండి 13 కిలో మీటర్ల దూరంలో ఉంది. పడవల ద్వారా అరగంటలో ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు.