పురాతణ ఇతిహాసం మహాభారతం నుండి విన్న పౌరాణిక కథల సమూహానికి ఈ పాండవన్ రాక్ ఒక వేదిక. రాజ్యం నుండి వెలి వేయబడ్డ పంచ పాండవులు అడవిలో సంచరిస్తున్నప్పుడు ఈ గుహలో విశ్రాంతి పొందారని పురాణాలు చెబుతున్నాయి. ఆ విధంగా ఈ పౌరాణిక ప్రదేశం చారిత్రక పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుకుంది. కాలం గడిచే కొద్ది ఈ గుహ ఒక చిన్న కొండగా మారిపోయింది.
అందమైన అక్షరాలు ఈ గుహ గోడలపై దర్శనమిస్తాయి. కుటుంబసమేతంగా సంతోషంగా గడిపేందుకు ఈ ప్రదేశం అనువైనది. ఈ రాయిని సులభం గా ఎక్కవచ్చు. వృద్ధులకి లేదా ఇతర సమస్యలు ఉన్న వారు తప్ప మిగతా వారు చాలా సులభంగా ఈ రాయిని ఎక్కగలరు. ఈ రాయి పై నుండి విశాలదృశ్య వీక్షణ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.
ఈ ప్రాంతం పైకి వెళుతున్న కొద్ది ఎన్నో మైదానాలు కనువిందు చేస్తాయి. అలెప్పి నుండి ఈ ప్రదేశానికి బస్సు, టాక్సీ లేదా ఆటో రిక్షా ద్వారా సులభంగా చేరుకోవచ్చు.