ఈ దేవాలయం మాత అంబాదేవి విగ్రహం కలిగి ఉంటుంది. అమరావతిలోని మధ్య భాగంలో గాంధీ స్క్వేర్ వద్ద కలదు. భీష్మకుడి కుమార్తె రుక్మిణిని ఆమెకు ఇష్టంలేని శిశుపాలుని వివాహం నుండి తప్పించి ఈ ఆలయంనుండి శ్రీక్రిష్ణుడు ఆమెను తీసుకు వెళ్ళి గాంధర్వ వివాహం చేసుకుంటాడు. నవరాత్రి లేదా దసరా పండుగ వేడుకలలో వేలాది భక్తులు మాత అంబాదేవిని దర్శించుకుంటారు. పండుగ వేడుకలలో భాగంగా ఒక అతిపెద్ద సంత కూడా దేవాలయ ఆవరణలో జరుపుతారు.



Click it and Unblock the Notifications