ఆయుష్ముగం క్షేత్రం అనంతనాగ్ లో ప్రసిద్ధి గాంచినది. దీనిని 15 వ శతాబ్దం లో నిర్మించారు. ఈ క్షేత్రాన్ని షేక్ జైన్ ఉద్ ఉద్దిన్ గౌరవార్ధం నిర్మించారు ఈయన ఖ్యాతి గాంచిన రిషి షేక్ నూర్ ఉద్దిన్ ప్రధాన శిష్యుడు. ఆయుష్ముగం పట్టణం లోని కొండలు ఒకప్పుడు హజరత్ జైన్ ఉద్దిన్ వాలి కి ఇల్లు లా ఉండేవి కనుక వివిధ మతాలకు చెందిన వారు ఈ ప్రదేశాన్ని పవిత్ర స్థలం గా భావిస్తారు.
స్థానికుల విస్వాస్వం మేరకు హజరత్ జైనుద్దీన్ వాలి తన జీవితం అంతా అల్లా గురించి ప్రజలకు బోధనలు చేసాడు. ఈ కారణం గా హజరత్ జైనుద్దిన్ వాలి జీవితాంతం తన గుహ కు మాత్రమే పరిమితమయాడు. ఆయుష్ముగం ప్రదేశానికి, ప్రతి ఏటా జరిగే ఉరుస్ మరియు జూల్ వేడుకలకు వేలాది భక్తులు వస్తూంటారు.