దోడ జిల్లా జమ్మూ కాశ్మీర్ లో సముద్రమట్టానికి సుమారు 1107 మీటర్ల ఎత్తున కలదు. ఇది 1948 లో ఉధంపూర్ జిల్లా నుండి ఏర్పడి జిల్లా స్టేటస్ పొందింది. ఈ ప్రదేశానికి దీదా అనే పాత్రలు తయారు చేసే ఒక ముల్తాన్ వలసదారు పేరు పెట్టారు. ఇపుడు ముల్తాన్ ప్రదేశం పాకిస్తాన్ లో వుంది.
దోడ ప్రదేశం ఒక చక్కని పర్యాటక ప్రదేశం. ఈ ప్రదేశంలో ఆకర్షణలు అంటే అవి భాదేర్వా చింతా వాలీ, సెఒజ్ మైదానం, భై పాదరి వంటివి కొన్నిగా చెప్పవచ్చు. భాదేర్వ కైలాష్ యాత్ర వంటి హిందువుల పుణ్య క్షేత్రం. ప్రతి సంవత్సరం ఆగష్టు నెలలో ఈ యాత్ర చేస్తారు.
చింతా వాలీ దాట్టమైన అడవుల మధ్య కలదు. ఇది ఒక సుందరమైన లోయ. భాదేర్వా సముద్రమట్టానికి 6500 అడుగుల ఎత్తున కలదు. సీఒజ్ మైదానం మరొక ప్రసిద్ధ ఆకర్షణ. దీనిని భాదేర్వా యొక్క వజ్ర కిరీటం అంటారు ఈ పచ్చిక మైదానం చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు వుంటాయి.
ఈ జిల్లాలో అనేక టెంపుల్స్ కూడా కలవు వాటిలో గుప్త గంగ టెంపుల్, శీతల మాత టెంపుల్, అలల్బాని టెంపుల్ మరియు నాగ్ని మాత టెంపుల్ ప్రసిద్ధి. ఇంతే కాక సుబార్ నాగ టెంపుల్, తుబు నాగ టెంపుల్, వాసుకి నాగ టెంపుల్ కూడా భాదేర్వా లో కలవు
ఈ ప్రదేశం ప్రధాన రోడ్ మార్గాలలో తేలికగా చేరవచ్చు. ఎయిర్ పోర్ట్ శ్రీనగర్ లో 200 కి.మీ.ల దూరం లో కలదు. ఇక్కడ నుండి దేశం లోని వివిధ నగరాలకు విమానాలు నడుస్తాయి ఎయిర్ పోర్ట్ నుండి దోడ కు టాక్సీ ల లో చేరవచ్చు.దోడ కు శ్రీనగర్ రైల్వే స్టేషన్ 200 కి. మీ. ల దూరం. ఇక్కడ నుండి అన్ని నగరాలకు చేరవచ్చు. రోడ్డు మార్గం లో అనేక ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సులు శ్రీనగర్ మరియు జమ్మూల నుండి కలవు.
దోడలో సంవత్సరం పొడవునా చల్లని వాతావరణం వుండి ఆహ్లాదంగా వుంటుంది. ఈ ప్రదేశ సందర్శనకు మార్చ్ నుండి నవంబర్ వరకు వాతావరణం బాగుంటుంది వింటర్ లో సాథారణంగా మంచు బాగా పడుతుంది.