కార్గిల్ జమ్మూ & కాశ్మీర్ లోని లడఖ్ లో ఒక జిల్లా గా వుంది. కార్గిల్ ను ల్యాండ్ ఆఫ్ ఆగాస్ అని కూడా పిలుస్తారు. ఈ జిల్లాలో షియా ముస్లిములు అధికంగా వుండటం చేత దీనికి ఈ పేరు వచ్చింది. శ్రీనగర్ కు సుమారు 205 కి. మీ.ల దూరం లో వున్న కార్గిల్ పాకిస్తాన్ తో మనకు గల లైన్ ఆఫ్ కంట్రోల్ కు దగ్గరగా కాశ్మీర్ వాలీ వైపుగా వుంది. ఈ ప్రదేశంలో ఒకప్పుడు అంటే 1999లో ఇండియా, పాకిస్తాన్ యుద్ధం జరిగింది దానిని కార్గిల్ యుద్ధం లేదా కార్గిల్ వివాదంగా చెపుతారు.
కార్గిల్ అంటే రెండు పదాల సముదాయం. 'ఖార్' అంటే భవనం మరియు 'ఇర్కిల్ ' అంటే కేంద్రం అని అర్ధం వస్తుంది. అంటే భవనాల మధ్య ఒక ప్రదేశం అని చెపుతారు. అంటే ఇది ఇండియా మరియు పాకిస్తాన్ రెండు దేశాల మధ్య కలదు. కార్గిల్ దాని బౌద్ధ ఆరామాలకు, సుందరమైన వాలీ లకు, చిన్న టవున్ల కు ప్రసిద్ధి. ఈ ప్రదేశంలో కొన్ని ప్రధాన టూరిస్ట్ ఆకర్షణలు మరియు బౌద్ధ ఆరామాలు, అంటే సాని ఆరామం, ముల్బెఖ్ ఆరామం, శార్గోలె ఆరామం వంటివి కలవు.
సాని ఆరామం సాని గ్రామం లో ప్రఖ్యాత మైన పురాతన ఆరామం. ప్రపంచం లోని బౌద్ధ మత గురువులు మార్పా, నరోపా, పద్మసంభవ వంటి వారు సందర్శించిన ప్రసిద్ధ 8 ఆరామాలలో ఇది ఒకటి. ఈ ఆరామం కుషాన్ రాజు అయిన కనిష్కుడి చే 1వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆరామంలో బౌద్ధుల పవిత్ర 108 స్తూపాలలొ ఒకదానిని ఇక్కడ ఉంచారు. 20 అడుగుల ఈ స్తూపం కానిక స్తూపం గా చెపుతారు. ఇది ఆరామం లో వెనుక ప్రాంగణంలో కలదు.
ముల్బెఖ్ ఆరామం లో లాఫింగ్ బుద్ధ లేదా, మైత్రేయ బుద్ధ, లేదా భవిష్య బుద్ధ అనే ప్రఖ్యాత విగ్రహం ఒక ప్రధాన ఆకర్షణ. ఈ ఆరామం ఒక కొండపై కలదు. దీనిలో 9 మీటర్ల పొడవైన బుద్ధుడి విగ్రహం కలదు. కొంతమంది మత ప్రచారకులు ఈ విగ్రహాన్ని తీసుకు వచ్చారని చెపుతారు.
కార్గిల్ ఉప జిల్లా అయిన జన్స్కార్ ను ప్రతి సంవత్సరం వేలాది టూరిస్టులు దర్శిస్తారు. సుమారు 8 నెలలు ఈ ప్రదేశం పూర్తి మంచు తో కప్పబడి వుండటం చే ఇక్కడకు ఎవరూ రారు. ఇంకా ఇక్కడ, కర్శా ఆరామం, జొన్గ్ఖుల్ ఆరామం, స్తంగ్ డే ఆరామం కలవు. సురు వాలీ లోని దరాంగ్ ద్రుంగ్ మంచు కొండ ఇక్కడ ఒక ప్రధాన ఆకర్షణ.
కర్శా ఆరామం చాలా పెద్దది. ఇందులో సుమారు 150 మంది బౌద్ధ సన్యాసులకు వసతి కల్పించబడింది. ఇక్కడకు చాలామంది యాత్రికులు వస్తారు. చోమో గొంప లేదా నాన్నారి కూడా ఆరామంలో కలదు. రాంగ్ డం ఆరామం, ఫూగ్ తాల్ ఆరామం, షార్ గోలే ఆరామం మరియు స్తారిమో ఆరామాలు కూడా ఈ జిల్లా లో ప్రసిద్ధి గాంచినవే.
కార్గిల్ శ్రీనగర్ సమీపం లో వుంటుంది. రోడ్ ద్వారా తేలికగా చేరవచ్చు. శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ దేశంలోని ఢిల్లీ, సిమ్లా, ముంబై, చండిఘర్ వంటి నగరాలకు కలుపబడి, కార్గిల్ కు సమీపంగా వుంటుంది.
కార్గిల్ కు జమ్మూ తావి రైలు స్టేషన్ సమీపం, ఇది సుమారు 540 కి. మీ. ల దూరం. ఇక్కడ నుండి కేరళ, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ నగరాలకు చేరవచ్చు. రైలు స్టేషన్ నుండి కార్గిల్ కు టాక్సీలు, బస్సు లు కలవు. జీపులు, టాక్సీలు, కూడా నడుస్తాయి.
కార్గిల్ ప్రాంతం హిమాలయా శ్రేణులలో వుండటంచే వాతావరణం వేడిగాను, చల్లగాను కూడా వుంటుంది. వింటర్ లో అధిక మంచు రాలటం వలన మార్గం మూసి వేస్తారు. టెంపరేచర్ - 48 డిగ్రీలు వరకు పడుతుంది. అసలు సంచిరించే వీలులేదు. ఈ ప్రాంతం వేసవిలో పర్యటనకు అనుకూలం. మే మరియు జూన్ ల మధ్య కార్గిల్ లో సైట్ సీఇంగ్ బాగుంటుంది.