కథువా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఒక జిల్లా. ఇది జమ్మూ కి 88 కి. మీ.ల దూరంలో కలదు. ఇతిహాసం మేరకు సుమారు 2000 సంవత్సరాల కిందట అన్దోత్ర వంశానికి చెందినా ఒక రాజపుత్ర రాజు జోద్ సింగ్ తన ముగ్గురు కుమారులతో ఈ ప్రదేశంలో స్థిరపడ్డాడు. ముగ్గురు కుమారులు మూడు ప్రదేశాలు కనుగొన్నారు. అవి తరాఫ్ మంజాలి, తరాఫ్ తజ్వాల్, మరియు తరాఫ్ భాజ్వాల్. ఈ మూడు ప్రదేశాలను కలిపి కతాల్ అని స్థానికులు పిలేచేవారు. అది కాలక్రమేణా కథువా గా మారింది.
ఈ జిల్లా లో వివిధ పర్యాటక ఆకర్షణలు, మత పర ప్రదేశాలు కూడా కలవు. బని, పన్యాలాగ్ చందేల్, సర్తాల్, దుగ్గాన్ మరియు బన్సాల్ వంటివి జిల్లాలో ప్రసిద్ధ ప్రదేశాలు. బని లోయ దట్టమైన అడవులు, అనేక జలపాతాలు అందమైన పచ్చిక మైదానాలు కల ప్రదేశం. బనిలో ధౌళ వాలి మాత మరియు జోడియా డి మాత టెంపుల్స్ కలవు.
మాత సుందరి కోటే, మాత బాల సుందరి, ఎయిర్ వాన్ టెంపుల్, మరియు ఆశా పురాని మందిర్ లు కథువా లో ప్రఖ్యాత టెంపుల్స్. పీర్ చట్టేర్శః మరియు గురుద్వారా సింగ్ సభ ఇతర మతపర ప్రదేశాలు. బసోలి, భాడ్డు, హిరానగర్, బిల్లావారాలు జిల్లాలో ప్రసిద్ధి టవున్లు.
బశోలి అనే చిన్నపట్టణం పెయింటింగ్ లకు ప్రసిద్ధి. బిల్లవార టవున్ 1598 మరియు 1614ల మధ్య రాజా భోపాట్ పాల్, స్థాపించారు. ఈ టవున్ లో అనేక స్మారకాలు, మరియు పురాతన మహాబిల్ వాకేశ్వర్, శివ టెంపుల్స్ కలవు.
కథువా కు అన్ని రకాల రవాణా కలదు. శ్రీ నగర్ ఎయిర్ పోర్ట్ దగ్గర. విదేశి ప్రయాణికులు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుండి శ్రీనగర్ కు చేరుకోవచ్చు.
కథువా రైల్వే స్టేషన్ కలదు. ఇది సిటీ కి 7 కి. మీ.ల దూరం. తక్షిల లో చేరవచ్చు. న్యూ ఢిల్లీ, జమ్మూ, సిమ్లా, శ్రీనగర్, కట్రా, ఉధంపూర్, చండి గర్ , పఠాన్ కోట్ ల నుండి బస్సులు కలవు.
కథువా పట్టణ వాతావరణం చెప్పాలంటే, వేసవులు నులి వెచ్చగా, శీతాకాలాలు అధిక చలిగా వుంటాయి. కథువా సందర్శనకు వేసవి అనుకూలం.